thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 20, 2023, 10:42 PM IST

ETV Bharat / Videos

ప్రజా నాడిపై దృష్టి సారిస్తున్న అగ్ర పార్టీలు

Prathidwani on Telangana Elections 2023 : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓవైపు పార్టీలు ప్రచారం ముమ్మరంగా చేస్తూ.. మరోవైపు ప్రజా నాడిపై దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల వ్యూహాల ప్రకారం ప్రచారం కొనసాగిస్తూ.. విజయం ఎవరి వైపు ఉందో తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజానాడి ఎవరి వైపు మొగ్గు చూపుతుందోనని అంచనాలు వేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రచారఘట్టం పతాకస్థాయికి చేరుకుంది. ఇప్పటికైనా రాజకీయ పక్షాలకు ప్రజల నాడి దొరికిందా? ఆకాంక్షలను అందుకోవడంలో ఏ పార్టీ ఎక్కడ ఉంది?

హామీలు, మేనిఫెస్టో రూపంలో ప్రచారం చేస్తున్న అధికార బీఆర్ఎస్​ అదే స్థాయిలో విపక్షాలపై ఎదురుదాడి చేస్తోంది. అటు కాంగ్రెస్ కూడా ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే కాంగ్రెస్ ప్రజలను ఆకట్టుకోగలిగిందా? బీఆర్ఎస్​, కాంగ్రెస్‌లో పోల్చితే ప్రచారంలో ఎవరు ముందున్నారు? ఎవరి మేనిఫెస్టో గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు.. ఎవరిపై ఓటర్లలో నమ్మకం పెరుగుతోంది.. ఎవరి ఆదరణ పెరుగుతోంది.. ఈ అంశాలపై ఈరోజు ఈటీవీ ప్రతిధ్వని కార్యక్రమంలో చర్చింద్దాం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.