ETV Bharat / international

'ఇండియాలో ఓటింగ్​ పెంచేందుకు అమెరికా ఫండింగా? వారికేం తక్కువ!' - మళ్లీ పాత పాటే పాడిన ట్రంప్! - TRUMP ON INDIAN TARIFFS

భారత్​ ఓటింగ్ పెంచేందుకు అమెరికా ఎందుకు డబ్బులు లివ్వాలన్న డొనాల్డ్​ ట్రంప్- వారి వద్దే చాలా డబ్బులున్నాయని ట్రంప్ - భారత్​ అత్యధిక టారిఫ్​ విధించే దేశం అని వ్యాఖ్య

Trump On Indian Tariffs
Trump On Indian Tariffs (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2025, 9:08 AM IST

Trump On Indian Tariffs : భారత్​ అత్యధిక టారిఫ్​లు విధించే దేశం అని మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. వారి వద్ద చాలా డబ్బులు ఉన్నాయన్నారు. అందువల్ల భారత్​లో ఓటింగ్​ పెంచేందుకు అమెరికా ఫండింగ్ ఎందుకని ప్రశ్నించారు. అలా అందించే 21 మిలియన్ డాలర్ల ఫండ్‌ను డోజ్​ రద్దు చేయడాన్ని ట్రంప్ సమర్థించారు. అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును ఎందుకు ఇవ్వాలంటూ ఆయన ప్రశ్నించారు. ఫ్లోరిడాలోని తన నివాసంలో ట్రంప్‌ మీడియా సమావేశంలో ఈ మేరకు ట్రంప్ మాట్లాడారు.

"ఇండియాకు మేమెందుకు 21 మిలియన్‌ డాలర్లు ఇవ్వాలి. వారివద్ద చాలా డబ్బు ఉంది. ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్​లు వసూలు చేస్తున్న దేశాల్లో అది ఒకటి. వారు విధించే సుంకాలు కూడా చాలా ఎక్కువ. ఈ విషయంలో అమెరికా ఎన్నడూ భారత్‌ను చేరుకోలేదు. నాకు భారత ప్రజలు, ఆ దేశ ప్రధాని పట్ల చాలా గౌరవం ఉంది. కానీ, వారి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్‌ డాలర్లు ఇవ్వాలా? మరి మన దేశంలో ఓటర్ల పరిస్థితి ఎలా ఉంది?" అని డొనాల్డ్​ ట్రంప్‌ ప్రశ్నల వర్షం కురిపించారు.

భారత్​తో పాటు ఇతర దేశాలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ ప్రపంచ కుబేరుడు, వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని డోజ్‌ విభాగం ఫిబ్రవరి 16న లిస్ట్​ విడుదల చేసింది. భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే 21 మిలియన్ డాలర్ల ఫండ్‌ను ఇటీవల ఈ విభాగం రద్దు చేసింది. బంగ్లాదేశ్‌, నేపాల్‌కు కేటాయించిన ఫండ్‌ను కూడా రద్దు చేసింది. డోజ్‌ తీసుకున్న నిర్ణయం భారత్‌లో రాజకీయ వివాదానికి తెరలేపింది.

Trump On Indian Tariffs : భారత్​ అత్యధిక టారిఫ్​లు విధించే దేశం అని మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. వారి వద్ద చాలా డబ్బులు ఉన్నాయన్నారు. అందువల్ల భారత్​లో ఓటింగ్​ పెంచేందుకు అమెరికా ఫండింగ్ ఎందుకని ప్రశ్నించారు. అలా అందించే 21 మిలియన్ డాలర్ల ఫండ్‌ను డోజ్​ రద్దు చేయడాన్ని ట్రంప్ సమర్థించారు. అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును ఎందుకు ఇవ్వాలంటూ ఆయన ప్రశ్నించారు. ఫ్లోరిడాలోని తన నివాసంలో ట్రంప్‌ మీడియా సమావేశంలో ఈ మేరకు ట్రంప్ మాట్లాడారు.

"ఇండియాకు మేమెందుకు 21 మిలియన్‌ డాలర్లు ఇవ్వాలి. వారివద్ద చాలా డబ్బు ఉంది. ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్​లు వసూలు చేస్తున్న దేశాల్లో అది ఒకటి. వారు విధించే సుంకాలు కూడా చాలా ఎక్కువ. ఈ విషయంలో అమెరికా ఎన్నడూ భారత్‌ను చేరుకోలేదు. నాకు భారత ప్రజలు, ఆ దేశ ప్రధాని పట్ల చాలా గౌరవం ఉంది. కానీ, వారి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్‌ డాలర్లు ఇవ్వాలా? మరి మన దేశంలో ఓటర్ల పరిస్థితి ఎలా ఉంది?" అని డొనాల్డ్​ ట్రంప్‌ ప్రశ్నల వర్షం కురిపించారు.

భారత్​తో పాటు ఇతర దేశాలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ ప్రపంచ కుబేరుడు, వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని డోజ్‌ విభాగం ఫిబ్రవరి 16న లిస్ట్​ విడుదల చేసింది. భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే 21 మిలియన్ డాలర్ల ఫండ్‌ను ఇటీవల ఈ విభాగం రద్దు చేసింది. బంగ్లాదేశ్‌, నేపాల్‌కు కేటాయించిన ఫండ్‌ను కూడా రద్దు చేసింది. డోజ్‌ తీసుకున్న నిర్ణయం భారత్‌లో రాజకీయ వివాదానికి తెరలేపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.