Palabhishekam For CM KCR Photo : దివ్యాంగులకు పింఛన్ పెంచడంపై హర్షం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Published : Aug 29, 2023, 9:17 PM IST
Palabhishekam for CM KCR Photo : దివ్యాంగుల కలను నిజం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొనియాడారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దివ్యాంగులకు రూ.4016 ఇచ్చిన గొప్ప వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. స్థానిక కూకట్పల్లి ఎన్.ఆర్.సి. గార్డెన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాన్ని ప్రజలతో కలిసి నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్లు అధికారంలోనున్న ఏ రాష్ట్రంలోనైనా దివ్యాంగులకు నాలుగువేల రూపాయల పెన్షన్లు ఇస్తున్నాయా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ప్రభుత్వం నూటికి నూరు శాతం ప్రజలను ఆదుకొనే ప్రభుత్వం అని వారి సంక్షేమానికి నిరంతరం కృషిచేస్తున్నామని తెలిపారు. తమ పింఛన్ను రూ.3016 నుంచి రూ.4016 కి పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని దివ్యాంగులు తెలిపారు.