thumbnail

Palabhishekam For CM KCR Photo : దివ్యాంగులకు పింఛన్ పెంచడంపై హర్షం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2023, 9:17 PM IST

Palabhishekam for CM KCR Photo : దివ్యాంగుల కలను నిజం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​ అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొనియాడారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దివ్యాంగులకు రూ.4016 ఇచ్చిన గొప్ప వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. స్థానిక కూకట్​పల్లి ఎన్.ఆర్.సి. గార్డెన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాన్ని ప్రజలతో కలిసి నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్​లు అధికారంలోనున్న ఏ రాష్ట్రంలోనైనా దివ్యాంగులకు నాలుగువేల రూపాయల పెన్షన్లు ఇస్తున్నాయా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ప్రభుత్వం నూటికి నూరు శాతం ప్రజలను ఆదుకొనే ప్రభుత్వం అని వారి సంక్షేమానికి నిరంతరం కృషిచేస్తున్నామని తెలిపారు. తమ పింఛన్​ను రూ.3016 నుంచి రూ.4016 కి పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల సీఎం కేసీఆర్​కు రుణపడి ఉంటామని దివ్యాంగులు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.