Minister Jagadish Reddy Visit Shirdi Temple : షిర్డీసాయిని దర్శించుకున్న మంత్రి జగదీశ్రెడ్డి.. - Jagadish Reddy visit to Shirdi
🎬 Watch Now: Feature Video


Published : Oct 18, 2023, 4:26 PM IST
Minister Jagadish Reddy Visit Shirdi Temple : రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్.. కుటుంబ సమేతంగా షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల వేళ.. బాబా ఆశీర్వాదం కోసం షిర్డీకి వచ్చినట్లు పేర్కొన్నారు. షిర్డీలో సౌకర్యాలు బాగున్నాయని కితాబిచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించాలని, బాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
Tungathurthy MLA Gadari Kishore Visit Shirdi : గతంలో కంటే ఈసారి ఎలక్షన్లలో.. బీఆర్ఎస్ పార్టీ మరిన్నీ సీట్లను కైవసం చేసుకుంటుందని మంత్రి జగదీశ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ అన్ని నియోజకవర్గ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్లో మాత్రం సీట్ల కోసం గొడవలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి ఖాయమన్నారు. ఒక కుటుంబ పెద్దగా ఆలోచించిన సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రజల స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో రూపొందించారన్నారు.