Mass Absence of Officials in Vikarabad MRO Office : ఎమ్మార్వో కార్యాలయంలో మూకుమ్మడిగా అధికారుల గైర్హాజరు.. కారణం అదే..? - Parigi Tehsildar Incident in Vikarabad
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-09-2023/640-480-19413679-thumbnail-16x9-official--absent--from--vikarabad--mro--office.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Sep 2, 2023, 3:52 PM IST
Mass Absence of Officials in Vikarabad MRO Office : వికారాబాద్ జిల్లా పరిగి తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు మూకుమ్మడిగా గైర్హాజరైన ఘటన చోటుచేసుకుంది. దీంతో చాలా మంది రిజిస్ట్రేషన్ల కోసం వచ్చి ఎదురు చూస్తున్నారు. లక్ష్మీదేవిపల్లికి చెందిన 94, 95, 96 సర్వే నంబర్లలోని 14 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు. దీంతో వివాదంలో ఉన్న భూమిని.. అగ్రిమెంటు చేయవద్దని అధికారులకు కోర్టు నోటీసులు పంపించింది.
నోటీసు పంపించినా వినకుండా గుట్టుచప్పుడు కాకుండా ఎమ్మార్వో దానయ్య రిజిస్ట్రేషన్ చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో గ్రామస్థులకు.. అధికారులకు వాగ్వివాదం జరిగింది. ఈ కారణంగా తహసీల్దార్ కార్యాలయానికి ఎమ్మార్వో మొదలుకొని చిన్న స్థాయి అధికారుల వరకు గైర్హాజరైనట్లు అరోపణలు వినిపిస్తున్నాయి. తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు ఎవరూ లేకపోవడంతో గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రిజిస్ట్రేషన్ల గురించి వచ్చి.. తిరిగి వెళ్లిపోవాల్సి వస్తుంది. దీనిపై ఉన్నత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.