thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2023, 10:50 AM IST

Updated : Nov 27, 2023, 11:01 AM IST

ETV Bharat / Videos

రాష్ట్రవ్యాప్తంగా కార్తిక పౌర్ణమి శోభ - శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు

Karthika Purnima 2023 : కార్తిక పౌర్ణమి వేళ రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. శివాలయాలన్నీ శివ నామస్మరణతో మారుమోగాయి. వేకువజామునుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు చేరుకున్నారు. గరళకంఠుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మరోవైపు గోదావరి, కృష్ణా నదుల్లో  పుణ్యస్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేశారు. దీంతో తదితర ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. నదుల్లో పుణ్యస్నానాల అనంతరం మహిళలు దీపాలు వెలిగించారు. 

Kartika Poornima Celebrations in Telangana : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. స్వామి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.  భద్రాచలంలోని గోదావరి నదిలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి.. కార్తిక దీపాలు వదిలారు. అనంతరం దేవాలయం వద్ద పూజలు చేశారు. దీపకాంతుల వెలుగులతో పరిసరాలు సందడిగా మారాయి. రామాలయ అనుబంధ.. శివాలయంలో జ్వాలాతోరణం నిర్వహించారు. 

Karthika Purnima Special Puja in Telangana :  ఖమ్మం జిల్లా మధిరలో కార్తిక పూజలు కన్నులపండువగా జరిగాయి. సూర్యాపేట జిల్లా.. మేళ్లచెరువు, హుజుర్‌నగర్‌లోని శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖమ్మంలోని శివాలయాలు కార్తిక పూజలతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున మూడు గంటల నుంచే మహిళలు భారీ సంఖ్యలో తరలి వచ్చి.. కార్తిక దీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం, గుంటు మల్లేశ్వరాలయం , సుగ్గుల వారి తోట శివాలయాలు భక్తుల రద్దీతో నిండిపోయాయి. 

హైదరాబాద్‌లోని శివాలయాలు శివ నామస్మరణతో మారుమోగాయి. కార్తిక పౌర్ణమి సందర్భంగా నగరంలోని పలు శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఓరుగల్లులోని వెయ్యి స్తంభాల ఆలయంలో కార్తిక పౌర్ణమి శోభ సంతరించుకుంది. కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని దీపాలు వెలిగించారు.

Last Updated : Nov 27, 2023, 11:01 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.