MLC Kadiyam on Rajaiah : 'ఎమ్మెల్యే రాజయ్య - సర్పంచ్ నవ్య మధ్య వివాదంపై విచారణ జరుగుతోంది'

By

Published : Jun 27, 2023, 3:31 PM IST

thumbnail

Kadiyam Comments On Rajaiah, Navya Controversy : రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్న ఎమ్మెల్యే రాజయ్య, జానకీపురం సర్పంచ్‌ కురుసపల్లి నవ్య వివాదంలో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య వివాదంపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఇన్​డైరెక్ట్​గా స్పందించారు. ప్రభుత్వ పరంగా పోలీసుల ద్వారా విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై వచ్చిన ఆరోపణల పైన ప్రభుత్వపరంగా విచారణ పూర్తయిన తర్వాత పార్టీ పరంగా నిర్ణయాలు ఉంటాయన్నారు. కడియం చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ సర్పంచ్‌ నవ్య గతంలో ఆరోపణలు చేసింది. దీనిపై వివాదం చెలరేగడంతో రూ.25లక్షలు గ్రామాభివృద్ధికి ఇస్తామని ప్రకటించి ఎమ్మెల్యే రాజయ్య.. నవ్యతో వివాదం పరిష్కరించుకున్నారు. అయితే తాజాగా ఈ నిధుల కేటాయింపుపై ఒప్పందం పేరుతో తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ధర్మసాగర్ పోలీస్ స్టేషన్​లో ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్​ నవ్య ఫిర్యాదు చేశారు. రాజయ్యతో పాటు ఆయన అనుచరుడు శ్రీనివాస్, ఎంపీపీ కవిత, తన భర్త ప్రవీణ్​ పైనా చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేయడంతో ముగిసిపోయిందనుకున్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.