thumbnail

By

Published : Apr 30, 2022, 4:55 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

ETV Bharat / Videos

భూతగాదాలో తండ్రీకొడుకుల కాల్పులు.. మహిళ పరిస్థితి విషమం

రెండు కుటుంబాల మధ్య భూతగాదాలు కాల్పులకు దారితీశాయి. ప్రత్యర్థి కుటుంబంపై తండ్రీకొడుకులు కాల్పులు జరిపిన ఘటన మధ్యప్రదేశ్​, గ్వాలియర్​లోని మోహనా పోలీస్​ స్టేషన్​ పరిధి రెహట్​ చరాయీ గ్రామంలో జరిగింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. బఘేల్​ కుటుంబంలో వారసత్వ భూమి వివాదం కొనసాగుతోంది. ఛత్రపాల్​ బఘేల్​ అనే వ్యక్తి ఆ భూమిలో పనులు చేస్తుండగా ఇంటి పక్కనే ఉండే హకీమ్​ సింగ్ బఘేల్​, అతడి కొడుకు అక్కడికి వచ్చి ఆపేందుకు ప్రయత్నించారు. అందుకు ఛత్రపాల్​ ఒప్పుకోలేదు. దీంతో ఇంటి డాబాపైకి ఎక్కి హకీమ్​ సింగ్​, అతడి కొడుకు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఛత్రపాల్​ సింగ్​ భార్య మీనాకు వెన్నులో తూటా తగిలింది. వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. తన కుమారుడిని అపహరించి అడవిలోకి పారిపోయారని ఆరోపించారు ఛత్రపాల్​. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.