కేసీఆర్​ను పరామర్శించిన మాజీ గవర్నర్​ నరసింహన్​ దంపతులు

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2024, 5:32 PM IST

thumbnail

Ex Governor ESL Narasimhan Meet Ex CM KCR in Hyderabad : బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ను తెలంగాణ మాజీ గవర్నర్​ ఈఎస్ఎల్​ నరసింహన్​ పరామర్శించారు. కేసీఆర్​ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బంజారాహిల్స్​లోని నందినగర్​ చేరుకున్న మాజీ గవర్నర్​ దంపతులు కేసీఆర్​తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. నరసింహన్​ దంపతులను తొలుత బీఆర్​ఎస్​ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మాజీ మంత్రి కేటీఆర్​ సాదరంగా ఆహ్వానించారు. కేసీఆర్​ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరలో పూర్తిస్థాయిలో కోలుకోవాలని మాజీ గవర్నర్​ నరసింహన్​ ఆకాంక్షించారు. కేసీఆర్​ సతీమణి శోభతో పాటు ఇతర కుటుంబసభ్యులను పలకరించారు.  

కేసీఆర్​ నివాసానికి వచ్చిన అతిథులకు కేసీఆర్​ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించి సంప్రదాయ పద్ధతిలో అతిథి మర్యాదలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు వేముల ప్రశాంత్​ రెడ్డి, శ్రీనివాస్​ గౌడ్​, కొప్పుల ఈశ్వర్​, ఎంపీ జోగినపల్లి సంతోశ్​కుమార్​ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాజీ హోంమంత్రి మహమూద్​ అలీ కూడా కేసీఆర్​ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.