ETV Bharat / bharat

UPSC సివిల్ సర్వీసెస్​ నయా రూల్​- ఇకపై అప్లికేషన్​తోపాటే ఆ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయడం మస్ట్​! - UPSC CSE EXAM 2025 NEW RULES

సివిల్​ సర్వీస్​లకు అప్లై చేయాలా? ఇకపై ఏజ్​, కాస్ట్ సర్టిఫికెట్స్ మస్ట్​- లేకుంటే అభ్యర్థిత్వం రద్దు

UPSC
UPSC (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2025, 7:53 PM IST

Updated : Jan 24, 2025, 8:32 PM IST

UPSC CSE Exam 2025 New Rules : యూపీఎస్​సీ అభ్యర్థులకు అలర్ట్​. కొత్త నిబంధల ప్రకారం, ఇకపై సివిల్​ సర్వీసెస్​ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ వయస్సు, రిజర్వేషన్​ కోటాకు సంబంధించిన పత్రాలు సమర్పించడం తప్పనిసరి.

గతంలో ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన తరువాత మాత్రమే అభ్యర్థులు తమ వయస్సు, కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. మాజీ ఐఏఎస్​ ప్రొబేషనరీ అధికారి పూజా ఖేద్కర్​ తప్పుడు ఓబీసీ, మెడికల్ సర్టిఫికెట్ సమర్పించి, వికలాంగుల కోటాలో ఐఏఎస్​కు ఎంపికయ్యారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఆమె ఈ ఆరోపణలు అన్నింటినీ ఖండించారు. ఏదేమైనప్పటికీ ఈ వివాదం నేపథ్యంలో యూపీఎస్​సీ ఇకపై ప్రిలిమినరీ పరీక్షకు ముందే సదరు పత్రాలు సమర్పించాలని కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

పరీక్షలు ఎలా జరుగుతాయంటే?
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్​ (ఐఏఎస్​), ఇండియన్ ఫారిన్ సర్వీస్​ (ఐఎఫ్​ఎస్​), ఇండియన్ పోలీస్​ సర్వీస్​ (ఐపీఎస్​) అధికారులను ఎంపిక చేయడానికి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్​ కమిషన్​ పరీక్షలు నిర్వహిస్తూ ఉంటుంది. ఇది ప్రిలిమినరీ, మెయిన్స్​, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో జరుగుతుంది.

ఈ పత్రాలు తప్పనిసరి!
సివిల్​ సర్వీసెస్​ ఎగ్జామ్ రూల్స్-2025 ప్రకారం,' సివిల్ సర్వీసెస్​ పరీక్షకు ఆన్​లైన్​లోనే దరఖాస్తు చేయాలి. అప్లికేషన్​లో పుట్టిన తేదీ, కులం లేదా వర్గం (ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్​, దివ్యాంగులు, మాజీ సైనికులు), విద్యార్హతలు, సర్వీస్ ప్రిఫరెన్స్​లను కచ్చితంగా పేర్కొనాలి. అలాగే వాటిని రుజువు చేసే పత్రాలను కచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఒకవేళ దరఖాస్తుతోపాటు ఈ పత్రాలు సమర్పించని పక్షంలో అభ్యర్థిత్వం రద్దు చేస్తారు.'

కేటగిరీలవారీగా పోస్టుల వివరాలు
ఈ ఏడాది సివిల్ సర్వీసెస్​ ప్రిలిమినరీ పరీక్ష మే 25న నిర్వహించనున్నట్లు యూపీఎస్​సీ ప్రకటించింది. ఈ పరీక్ష ద్వారా సుమారుగా 979 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇందులో దివ్యాంగులకు 38 పోస్టులు కేటాయించారు. అంధత్వం లేదా దృష్టి తక్కువ ఉన్న అభ్యర్థులకు 12 పోస్టులు; చెవిటి వారికి 7; సెరిబ్రల్​ పాల్సీ, కుష్టు వ్యాధి నయమైన వారు, మరుగుజ్జులు, యాసిడ్ దాడి బాధితులు, కండరాల బలహీనత, లోకోమోటర్​ వైకల్యం ఉన్నవారికి 10; బహుళ వైకల్యం ఉన్నవారికి 9 పోస్టులు ఉన్నాయి.

ఇక ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ నియమ, నిబంధనల మేరకు రిజర్వేషన్లు ఉంటాయి. ఆసక్తి గల అభ్యర్థులు http://upsconline.gov.in వైబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2025 ఫిబ్రవరి 11 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. సివిల్ సర్వీసుల్లో లింగ సమతుల్యతను సాధించాలని ప్రభుత్వం సంకల్పించింది. కనుక మహిళా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవాలని పోత్సహిస్తోంది.

UPSC CSE Exam 2025 New Rules : యూపీఎస్​సీ అభ్యర్థులకు అలర్ట్​. కొత్త నిబంధల ప్రకారం, ఇకపై సివిల్​ సర్వీసెస్​ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ వయస్సు, రిజర్వేషన్​ కోటాకు సంబంధించిన పత్రాలు సమర్పించడం తప్పనిసరి.

గతంలో ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన తరువాత మాత్రమే అభ్యర్థులు తమ వయస్సు, కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. మాజీ ఐఏఎస్​ ప్రొబేషనరీ అధికారి పూజా ఖేద్కర్​ తప్పుడు ఓబీసీ, మెడికల్ సర్టిఫికెట్ సమర్పించి, వికలాంగుల కోటాలో ఐఏఎస్​కు ఎంపికయ్యారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఆమె ఈ ఆరోపణలు అన్నింటినీ ఖండించారు. ఏదేమైనప్పటికీ ఈ వివాదం నేపథ్యంలో యూపీఎస్​సీ ఇకపై ప్రిలిమినరీ పరీక్షకు ముందే సదరు పత్రాలు సమర్పించాలని కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

పరీక్షలు ఎలా జరుగుతాయంటే?
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్​ (ఐఏఎస్​), ఇండియన్ ఫారిన్ సర్వీస్​ (ఐఎఫ్​ఎస్​), ఇండియన్ పోలీస్​ సర్వీస్​ (ఐపీఎస్​) అధికారులను ఎంపిక చేయడానికి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్​ కమిషన్​ పరీక్షలు నిర్వహిస్తూ ఉంటుంది. ఇది ప్రిలిమినరీ, మెయిన్స్​, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో జరుగుతుంది.

ఈ పత్రాలు తప్పనిసరి!
సివిల్​ సర్వీసెస్​ ఎగ్జామ్ రూల్స్-2025 ప్రకారం,' సివిల్ సర్వీసెస్​ పరీక్షకు ఆన్​లైన్​లోనే దరఖాస్తు చేయాలి. అప్లికేషన్​లో పుట్టిన తేదీ, కులం లేదా వర్గం (ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్​, దివ్యాంగులు, మాజీ సైనికులు), విద్యార్హతలు, సర్వీస్ ప్రిఫరెన్స్​లను కచ్చితంగా పేర్కొనాలి. అలాగే వాటిని రుజువు చేసే పత్రాలను కచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఒకవేళ దరఖాస్తుతోపాటు ఈ పత్రాలు సమర్పించని పక్షంలో అభ్యర్థిత్వం రద్దు చేస్తారు.'

కేటగిరీలవారీగా పోస్టుల వివరాలు
ఈ ఏడాది సివిల్ సర్వీసెస్​ ప్రిలిమినరీ పరీక్ష మే 25న నిర్వహించనున్నట్లు యూపీఎస్​సీ ప్రకటించింది. ఈ పరీక్ష ద్వారా సుమారుగా 979 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇందులో దివ్యాంగులకు 38 పోస్టులు కేటాయించారు. అంధత్వం లేదా దృష్టి తక్కువ ఉన్న అభ్యర్థులకు 12 పోస్టులు; చెవిటి వారికి 7; సెరిబ్రల్​ పాల్సీ, కుష్టు వ్యాధి నయమైన వారు, మరుగుజ్జులు, యాసిడ్ దాడి బాధితులు, కండరాల బలహీనత, లోకోమోటర్​ వైకల్యం ఉన్నవారికి 10; బహుళ వైకల్యం ఉన్నవారికి 9 పోస్టులు ఉన్నాయి.

ఇక ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ నియమ, నిబంధనల మేరకు రిజర్వేషన్లు ఉంటాయి. ఆసక్తి గల అభ్యర్థులు http://upsconline.gov.in వైబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2025 ఫిబ్రవరి 11 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. సివిల్ సర్వీసుల్లో లింగ సమతుల్యతను సాధించాలని ప్రభుత్వం సంకల్పించింది. కనుక మహిళా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవాలని పోత్సహిస్తోంది.

Last Updated : Jan 24, 2025, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.