గోమూత్రం, పేడతో ప్రత్యేక తివాచీ​- ప్రధాని మోదీకి స్పెషల్​ గిఫ్ట్​! - ఆవు పేడతో తివాచీ తయారీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 10:10 PM IST

Cow Dung Mat Made For Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కానుకగా ఇచ్చేందుకు ఆవు పేడ, గోమూత్రంతో ఓ ప్రత్యేక తివాచీ రూపొందించారు ఛత్తీస్​గఢ్​ ఖైరాగఢ్​లోని మనోహర్​ గోశాల నిర్వాహకులు. ఆయుర్వేద హితామహుల్లో ఒకరైన చరకుడి ప్రేరణతోనే దీనిని తయారు చేసినట్లు తెలిపారు.

"ఈ తివాచీని ఆవు పేడతో తయారు చేశాము. ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ఆయుర్వేద పితామహుడు చరకుడు ఈ తివాచీని వాడారు. ఆయన ప్రేరణతోనే తివాచీని సిద్ధం చేశాము. ఇదే కాకుండా ఆయన నుంచి మనం ప్రేరణ పొందాల్సిన విషయాలు చాలా ఉన్నాయి."

--పాదం డాక్​లియా, మనోహర్​ గోశాల మేనేజింగ్​ ట్రస్టీ

ఈ తివారీ బరువు 14 కిలోలకుపైనే. దీనిని తయారు చేయడానికి సౌమ్య కామధేను జాతికి చెందిన ఆవు పేడ, మూత్రాన్ని వినియోగించారు.

"ఈ తివాచీని పూర్తిగా సౌమ్యకామధేను అనే జాతికి చెందిన ఆవుమూత్రం, పేడతో తయారు చేశాము. ఈ రకం ఆవులకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఈ ఆవు జాతి గోల్డెన్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో కూడా స్థానం సంపాదించింది."

--పాదం డాక్​లియా, మనోహర్​ గోశాల మేనేజింగ్​ ట్రస్టీ

మోదీ కోసం తయారు చేసిన ఈ తివాచీని త్వరలోనే దిల్లీలోని ఆయన నివాసానికి పంపించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.