ఉప్పల్ దేవేందర్ నగర్లో ఉద్రిక్తత, పోలీస్ స్టేషన్ను ముట్టడించిన కాంగ్రెస్ శ్రేణులు - పోలీసులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నిరసన
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-11-2023/640-480-20012963-thumbnail-16x9-uppal-ci-brs.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Nov 13, 2023, 4:18 PM IST
Congress Leaders Fire on Uppal CI conduct : హైదరాబాద్లోని ఉప్పల్ దేవేందర్ నగర్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఐ శ్రావణ్ కుమార్ అకారణంగా యువకులను కొట్టారంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఉప్పల్ సీఐ సహకరిస్తున్నారని ఆరోపిస్తూ.. నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పోలీసు స్టేషన్ని ముట్టడించారు. దేవేందర్ నగర్లోని కాంగ్రెస్ మద్దతుదారులైన యువకులపై.. అకారణంగా సీఐ చేయి చేసుకున్నారని ఆరోపించారు. రాత్రి వేళ వారి ఇంట్లోకి ప్రవేశించి చితకబాదారని వాపోయారు.
దేవేందర్ నగర్ కాలనీవాసులు పెద్దఎత్తున పోలీసు స్టేషన్కు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థికి సహకరిస్తూ, కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులపై బెదిరింపులకు దిగుతున్న సీఐ శ్రవణ్ కుమార్పై చర్యలు తీసుకోవాలని పరమేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలను కాపాడాల్సిన యంత్రాంగమే పార్టీలకు కొమ్ముకాస్తోందని.. ఈ సంస్కృతి కొనసాగితే ప్రజాస్వామ్యం కూనీ అవుతుందని కాంగ్రెస్ అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డి ఆక్షేపించారు. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల వ్యవహరించడం తగదన్నారు.