వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు.. లైవ్ వీడియో - ఔరంగాబాద్ నేర వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15465967-thumbnail-3x2-murder.jpg)
ఓ వ్యక్తిని సజీవదహనం చేసేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ సంఘటన మహారాష్ట్ర, ఔరంగాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. జల్నా గ్రామంలో పట్టపగలు ఇంట్లోకి చొరబడి తుకారామ్ మండల్ అనే వ్యక్తిపై దేశ్ముఖ్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గమనించిన స్థానికులు మంటలు అర్పేసి ఔరంగాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 50 శాతం మేర శరీరం కాలిపోయినట్లు వైద్యులు తెలిపారు. నగరంలోని ఓ భూమికి సంబంధించిన వివాదమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. నిందితుడు సురాజ్ దేశ్ముఖ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST