చితక్కొట్టుకున్న రెండు కుటుంబాలు.. భూతగాదాలే కారణం
Two families clash: దీర్ఘకాలంగా ఉన్న భూతగాదాలతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. కర్ణాటక హవేరి జిల్లా హంగల్ తాలూకాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. కేలవరకొప్ప గ్రామంలో నివాసం ఉండే వీరేశ్ కుపాగడ్డి, శ్రీవానంద కొడిహళ్లి కుటుంబాలకు చెందిన పలువురు.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రాళ్లు, మట్టిగడ్డలను విసురుకున్నారు. కుపాగడ్డి కుటుంబం.. కొడిహళ్లి కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులపై కేసు పెట్టింది. ప్రతిగా కొడిహళ్లి కుటుంబ సభ్యులు 12 మందిపై ఫిర్యాదు చేశారు.