thumbnail

ఇంట్లోకి వచ్చి మంచం ఎక్కిన పులి...!

By

Published : Jul 19, 2019, 10:22 AM IST

అసోంలో కురుస్తున్న భారీ వర్షాలకు కాజీరంగా జాతీయ ఉద్యానవనం నీట మునిగింది. అందులోని వన్యప్రాణాలు సురక్షిత ప్రాంతాల కోసం అన్వేషిస్తున్నాయి. ఓ పులి ఏకంగా హర్మోటీ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి చొరబడింది. మంచంపై హాయిగా సేదతీరింది. ఇది తెలుసుకున్న పరిసర ప్రాంత ప్రజలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అటవీ అధికారులు ఆ మూగజీవిని అక్కడి నుంచి తరలించడానికి చర్యలు చేపట్టారు. ఆ దృశ్యాలను చూడటానికి ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.