పొగాకు నియంత్రణపై​ 'సైకత' సందేశం - పొగాకు వ్యతిరేక దినంపై సుదర్శన్​ పట్నాయక్ ఆర్ట్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 31, 2021, 11:01 AM IST

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ సైకత కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ వినూత్నంగా సందేశం ఇచ్చారు. పొగాకు వినియోగంపై ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పం తయారు చేశారు. పొగాకు వినియోగం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను వివరించేలా ఈ శిల్పాన్ని తీర్చిదిద్దారు. కరోనా కాలంలో పొగాకు తాగడం ఇతరులకు కూడా ప్రమాదకరమని తెలిపేలా కళాఖండాన్ని రూపోందించారు. సైకత శిల్పంతో పొగాకు వినియోగంపై ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు ఇలా చేశానని తెలిపారు సుదర్శన్​ పట్నాయక్. ఈ కళాఖండం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.