thumbnail

By

Published : Dec 24, 2019, 11:37 AM IST

Updated : Dec 24, 2019, 12:41 PM IST

ETV Bharat / Videos

బంగాల్ గవర్నర్​కు రెండో రోజూ తప్పని 'పౌర' సెగ

బంగాల్ గవర్నర్ జగదీశ్ ధన్​కర్​కు వరుసగా రెండోరోజూ చేదు అనుభవం ఎదురైంది. జాదవ్​పుర్ విశ్వవిద్యాలయంలో నిన్న జరిగిన స్నాతకోత్సవానికి హాజరయ్యే సమయంలో నిలువరించిన విద్యార్థులు ఈ రోజు కూడా ధన్​కర్ కాన్వాయ్​ను అడ్డగించారు. ధన్​కర్ కారు ముందు నల్లజెండాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఇటీవలి కాలంలో జగదీశ్ ధన్​కర్​కు ఇలాంటి సంఘటనలు తరచూ ఎదురవుతున్నాయి. అయితే.. ఈ ఘటనపై గవర్నర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగాల్‌లో వ్యవస్ధలు కుప్పకూలిపోయాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.
Last Updated : Dec 24, 2019, 12:41 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.