గుంతలకు పూజలు.. ప్రజల వినూత్న నిరసన
God Of Potholes: కర్ణాటకలో ఇటీవల కురిసిన వర్షాలతో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. రోడ్లపై గుంతలు ఏర్పడి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. దీంతో బెంగళూరులోని కాక్స్టౌన్లో ప్రజలు వినూత్నంగా నిరసన తెలిపారు. చార్లెస్ క్యాంప్బెల్ రోడ్డుపై ఏర్పడ్డ గుంతలకు పూలతో అందంగా అలంకరించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని పూజారితో పూజలు కూడా జరిపించారు. రాజధానిలో రోడ్ల మరమ్మతులకు కేటాయించిన రూ.20 వేల కోట్లు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా మేల్కొని రోడ్లను బాగుచేయకపోతే ఆందోళన చేపడతామని బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎమ్సీ)ను హెచ్చరించారు.