ETV Bharat / sukhibhava

Health tips:తిన్న వెంటనే ఈ పనులు చేయకూడదట!

భోజనం చేసిన వెంటనే ఓ కప్పు కాఫీ/టీ తాగడం నిఖితకు అలవాటు.. ఆరోగ్యానికి మంచిదన్న ఉద్దేశంతో రోజూ తిన్న వెంటనే ఏదో ఒక పండు తీసుకుంటుంటుంది పావని.. ఉదయం నుంచి వివిధ పనులతో అలసిపోయిన మాధురి తిన్న వెంటనే అలా నడుం వాల్చుతుంటుంది.. భోజనం చేసిన వెంటనే మీరూ ఇలాగే చేస్తున్నారా? అయితే ఈ అలవాట్లను ఎంత త్వరగా మానుకుంటే ఆరోగ్యానికి అంత మంచిదంటున్నారు నిపుణులు. తెలిసో, తెలియకో చాలామంది చేసే ఈ పొరపాట్ల కారణంగా జీర్ణ వ్యవస్థ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని, తద్వారా కొంతమందిలో లేనిపోని అనారోగ్యాలకు ఇది దారితీస్తుందని అంటున్నారు. మరైతే భోజనం చేసిన వెంటనే చేయకూడని ఆ పనులేంటో మనమూ తెలుసుకుందాం రండి..

author img

By

Published : Jun 23, 2021, 4:39 PM IST

avoid these things right after a meal in telugu
Health tips:తిన్న వెంటనే ఈ పనులు చేయకూడదట!

కునుకు తీయద్దు!

మధ్యాహ్నం భోజనం పూర్తయ్యిందంటే చాలు.. కొంతమంది కునుకు తీయడానికి ఉపక్రమిస్తుంటారు. అయితే మధ్యాహ్నం పూట కాసేపు నిద్ర పోవడం మంచి అలవాటే అయినా తిన్న వెంటనే వద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనివల్ల పొట్టలో ఆహారం జీర్ణం చేయడానికి ఉత్పత్తయ్యే రసాలు మరింత ఎక్కువగా ఉత్పత్తవుతాయట! ఫలితంగా గుండెలో మంట, జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతినడం.. వంటి సమస్యలొస్తాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే భోంచేశాక అరగంట లేదా గంట తర్వాతే నిద్రకు ఉపక్రమించమంటున్నారు. అది కూడా ఓ అరగంట సేపు చాలంటున్నారు. అందుకే రాత్రి పూట కూడా పడుకోవడానికి రెండు మూడు గంటల ముందే డిన్నర్‌ పూర్తి చేయమని నిపుణులు పదే పదే చెబుతుంటారు.

స్నానం చేస్తున్నారా?

తిన్న వెంటనే స్నానం చేయడం కొంతమందికి అలవాటుంటుంది. ముఖ్యంగా ఈ వేసవి వేడిని తట్టుకోలేక కొందరు రాత్రిపూట ఇలా చేస్తుంటారు. అలాంటి వారు ఈ అలవాటును మానుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి, పొట్టకు సరైన మొత్తంలో రక్తప్రసరణ అవసరం. అయితే స్నానం వల్ల ఆ రక్తం చర్మం వైపు ప్రసరించి శరీర ఉష్ణోగ్రతను అదుపు చేస్తుంది. ఫలితంగా ఆహారం జీర్ణం కావడానికి మరింత ఎక్కువ సమయం పడుతుంది. దీని కారణంగా అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. అందుకే భోంచేశాక 30 లేదా 40 నిమిషాల తర్వాతే షవర్‌ చేయమంటున్నారు.

గంట తర్వాతే ఇవి!

భోజనం చేసిన వెంటనే కొంతమందికి టీ/కాఫీ తాగే అలవాటుంటుంది. అయితే దీనివల్ల మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలు, ఐరన్‌.. వంటివి గ్రహించే శక్తి శరీరానికి క్రమంగా తగ్గుతుందని చెబుతోంది ఓ అధ్యయనం. ఇందుకు వీటిలోని ఫెనోలిక్‌ సమ్మేళనాలే కారణమట! కాబట్టి తిన్న వెంటనే కాకుండా గంటయ్యాక అదీ తక్కువ మోతాదులో తాగితే ఎలాంటి సమస్యా ఉండదట!

ఇక తిన్న వెంటనే గడగడా నీళ్లు తాగేసే వారూ లేకపోలేదు. ఇలా చేస్తే తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి పొట్టలో ఉత్పత్తయ్యే ఎంజైమ్స్‌, జీర్ణ రసాలు.. తక్కువగా విడుదలవుతాయట! ఫలితంగా ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.. కాబట్టి భోజనం చేసిన వెంటనే కాకుండా గంటయ్యాక ఓ గ్లాసు నీళ్లు తాగమంటున్నారు నిపుణులు.

పండ్లు అప్పుడైతే మరీ మంచిదట!

తిన్న వెంటనే ఏదో ఒక పండు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు చెబుతుంటారు. ఇది నిజమే అయినా భోంచేశాక తీసుకునే కంటే అల్పాహార సమయంలో/పరగడుపున తీసుకున్నట్లయితే వాటిలోని పోషకాలను శరీరం మరింత సమర్థంగా గ్రహిస్తుందని చెబుతున్నారు మరికొంతమంది నిపుణులు. ఒకవేళ భోజనం తర్వాత తీసుకుంటే ఇతర పదార్థాలతో అది కలిసిపోయి వాటిలోని సంపూర్ణ పోషకాలు శరీరానికి అందవన్నది వారి అభిప్రాయం! కాబట్టి పండు తినాలనుకుంటే బ్రేక్‌ఫాస్ట్‌గా, మిడ్‌మీల్‌ (అల్పాహారం, లంచ్‌కి మధ్యలో), అదీ కాదంటే సాయంత్రం స్నాక్‌గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు.

తిన్న వెంటనే వ్యాయామం చేయచ్చా?!

ఈ ప్రశ్నకు ఎవరైనా చేయకూడదు అనే సమాధానం చెబుతారు.. కానీ దీని వెనకున్న అసలు కారణమేంటనేది కొంతమందికే తెలుసు! కడుపు నిండా భోజనం చేసేసరికి వ్యాయామం చేయడానికి శరీరం సహకరించదు.. పైగా ఇలా చేయడం వల్ల కడుపులో అసౌకర్యం, కడుపునొప్పి.. వంటి సమస్యలొస్తాయట! అంతేకాదు.. వర్కవుట్‌ చేసే క్రమంలో కండరాలు, ఆహారం జీర్ణం చేసే క్రమంలో జీర్ణవ్యవస్థ.. ఈ రెండింటి మధ్య పోటీ నెలకొని.. శరీరానికి సరైన వ్యాయామం కూడా అందదని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ సమస్యలన్నీ లేకుండా ఉండాలంటే.. ఫైబర్‌, కొవ్వులు తక్కువగా; కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పెరుగు, పండ్లు, గార్నోలా బార్స్‌, పీనట్‌ బటర్‌, హోల్‌ వీట్‌ టోస్ట్‌.. వంటి పదార్థాలు మితంగా తీసుకొని.. ఆపై అరగంట తర్వాత వర్కవుట్‌కు ఉపక్రమించమని నిపుణులు సలహా ఇస్తున్నారు.

అయితే ఒక్కొక్కరి ఆరోగ్య స్థితి, శరీర తత్వం ఒక్కోలా ఉంటుంది.. కాబట్టి ఈ సమస్యలన్నీ అందరిలో తలెత్తాలని లేదు. అందుకే ఈ అలవాట్ల కారణంగా మీ ఆరోగ్యంలో ఏదైనా అసౌకర్యం కలిగినట్లనిపిస్తే వెంటనే వాటిని ఆపేసి.. డాక్టర్‌ సలహా తీసుకోవడం మంచిదన్నది నిపుణుల అభిప్రాయం!

ఇదీ చదవండి: Kachili Fish: ఈ చేప ధర రూ.2.60లక్షలు

కునుకు తీయద్దు!

మధ్యాహ్నం భోజనం పూర్తయ్యిందంటే చాలు.. కొంతమంది కునుకు తీయడానికి ఉపక్రమిస్తుంటారు. అయితే మధ్యాహ్నం పూట కాసేపు నిద్ర పోవడం మంచి అలవాటే అయినా తిన్న వెంటనే వద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనివల్ల పొట్టలో ఆహారం జీర్ణం చేయడానికి ఉత్పత్తయ్యే రసాలు మరింత ఎక్కువగా ఉత్పత్తవుతాయట! ఫలితంగా గుండెలో మంట, జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతినడం.. వంటి సమస్యలొస్తాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే భోంచేశాక అరగంట లేదా గంట తర్వాతే నిద్రకు ఉపక్రమించమంటున్నారు. అది కూడా ఓ అరగంట సేపు చాలంటున్నారు. అందుకే రాత్రి పూట కూడా పడుకోవడానికి రెండు మూడు గంటల ముందే డిన్నర్‌ పూర్తి చేయమని నిపుణులు పదే పదే చెబుతుంటారు.

స్నానం చేస్తున్నారా?

తిన్న వెంటనే స్నానం చేయడం కొంతమందికి అలవాటుంటుంది. ముఖ్యంగా ఈ వేసవి వేడిని తట్టుకోలేక కొందరు రాత్రిపూట ఇలా చేస్తుంటారు. అలాంటి వారు ఈ అలవాటును మానుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి, పొట్టకు సరైన మొత్తంలో రక్తప్రసరణ అవసరం. అయితే స్నానం వల్ల ఆ రక్తం చర్మం వైపు ప్రసరించి శరీర ఉష్ణోగ్రతను అదుపు చేస్తుంది. ఫలితంగా ఆహారం జీర్ణం కావడానికి మరింత ఎక్కువ సమయం పడుతుంది. దీని కారణంగా అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. అందుకే భోంచేశాక 30 లేదా 40 నిమిషాల తర్వాతే షవర్‌ చేయమంటున్నారు.

గంట తర్వాతే ఇవి!

భోజనం చేసిన వెంటనే కొంతమందికి టీ/కాఫీ తాగే అలవాటుంటుంది. అయితే దీనివల్ల మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలు, ఐరన్‌.. వంటివి గ్రహించే శక్తి శరీరానికి క్రమంగా తగ్గుతుందని చెబుతోంది ఓ అధ్యయనం. ఇందుకు వీటిలోని ఫెనోలిక్‌ సమ్మేళనాలే కారణమట! కాబట్టి తిన్న వెంటనే కాకుండా గంటయ్యాక అదీ తక్కువ మోతాదులో తాగితే ఎలాంటి సమస్యా ఉండదట!

ఇక తిన్న వెంటనే గడగడా నీళ్లు తాగేసే వారూ లేకపోలేదు. ఇలా చేస్తే తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి పొట్టలో ఉత్పత్తయ్యే ఎంజైమ్స్‌, జీర్ణ రసాలు.. తక్కువగా విడుదలవుతాయట! ఫలితంగా ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.. కాబట్టి భోజనం చేసిన వెంటనే కాకుండా గంటయ్యాక ఓ గ్లాసు నీళ్లు తాగమంటున్నారు నిపుణులు.

పండ్లు అప్పుడైతే మరీ మంచిదట!

తిన్న వెంటనే ఏదో ఒక పండు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు చెబుతుంటారు. ఇది నిజమే అయినా భోంచేశాక తీసుకునే కంటే అల్పాహార సమయంలో/పరగడుపున తీసుకున్నట్లయితే వాటిలోని పోషకాలను శరీరం మరింత సమర్థంగా గ్రహిస్తుందని చెబుతున్నారు మరికొంతమంది నిపుణులు. ఒకవేళ భోజనం తర్వాత తీసుకుంటే ఇతర పదార్థాలతో అది కలిసిపోయి వాటిలోని సంపూర్ణ పోషకాలు శరీరానికి అందవన్నది వారి అభిప్రాయం! కాబట్టి పండు తినాలనుకుంటే బ్రేక్‌ఫాస్ట్‌గా, మిడ్‌మీల్‌ (అల్పాహారం, లంచ్‌కి మధ్యలో), అదీ కాదంటే సాయంత్రం స్నాక్‌గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు.

తిన్న వెంటనే వ్యాయామం చేయచ్చా?!

ఈ ప్రశ్నకు ఎవరైనా చేయకూడదు అనే సమాధానం చెబుతారు.. కానీ దీని వెనకున్న అసలు కారణమేంటనేది కొంతమందికే తెలుసు! కడుపు నిండా భోజనం చేసేసరికి వ్యాయామం చేయడానికి శరీరం సహకరించదు.. పైగా ఇలా చేయడం వల్ల కడుపులో అసౌకర్యం, కడుపునొప్పి.. వంటి సమస్యలొస్తాయట! అంతేకాదు.. వర్కవుట్‌ చేసే క్రమంలో కండరాలు, ఆహారం జీర్ణం చేసే క్రమంలో జీర్ణవ్యవస్థ.. ఈ రెండింటి మధ్య పోటీ నెలకొని.. శరీరానికి సరైన వ్యాయామం కూడా అందదని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ సమస్యలన్నీ లేకుండా ఉండాలంటే.. ఫైబర్‌, కొవ్వులు తక్కువగా; కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పెరుగు, పండ్లు, గార్నోలా బార్స్‌, పీనట్‌ బటర్‌, హోల్‌ వీట్‌ టోస్ట్‌.. వంటి పదార్థాలు మితంగా తీసుకొని.. ఆపై అరగంట తర్వాత వర్కవుట్‌కు ఉపక్రమించమని నిపుణులు సలహా ఇస్తున్నారు.

అయితే ఒక్కొక్కరి ఆరోగ్య స్థితి, శరీర తత్వం ఒక్కోలా ఉంటుంది.. కాబట్టి ఈ సమస్యలన్నీ అందరిలో తలెత్తాలని లేదు. అందుకే ఈ అలవాట్ల కారణంగా మీ ఆరోగ్యంలో ఏదైనా అసౌకర్యం కలిగినట్లనిపిస్తే వెంటనే వాటిని ఆపేసి.. డాక్టర్‌ సలహా తీసుకోవడం మంచిదన్నది నిపుణుల అభిప్రాయం!

ఇదీ చదవండి: Kachili Fish: ఈ చేప ధర రూ.2.60లక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.