ETV Bharat / sukhibhava

మందులేనా? మంచి తిండీ ముఖ్యమే!

author img

By

Published : Oct 17, 2020, 11:22 AM IST

జబ్బుల నుంచి కోలుకోవటానికి మందులతోపాటు మంచి తిండీ ముఖ్యమేనని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. చికిత్స ఫలితాలు మెరుగుపడటానికి, జబ్బుల దుష్ప్రభావాలు తగ్గటానికి, త్వరగా కోలుకోవటానికి అది దోహదం చేస్తుందని తెలిపింది.

good nutrition along with medication
మందులేనా?మంచి తిండీ ముఖ్యమే!

ఆసుపత్రిలో చేరినవారికి మందులు మాత్రమే కాదు, తిండీ ముఖ్యమే. అది ఆయా వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా ఉన్నదైతే ఇంకా మంచిదని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. చికిత్స ఫలితాలు మెరుగుపడటానికి, జబ్బుల దుష్ప్రభావాలు తగ్గటానికి, త్వరగా కోలుకోవటానికిది దోహదం చేస్తుంది.

ఏదైనా జబ్బుతో ఆసుపత్రిలో చేరినప్పుడు తినటానికి, తాగటానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. దీంతో శరీరానికి తగినంతగా ప్రొటీన్లు, శక్తి అందవు. ఫలితంగా చికిత్స తీసుకుంటున్నా అంతగా గుణం కనిపించకపోవచ్ఛు జబ్బు ముదురుతుండొచ్ఛు దుష్ప్రభావాల ముప్పు పెరగొచ్ఛు కొన్నిసార్లు ప్రాణాపాయానికీ దారితీయొచ్ఛు అందుకే పోషణలోపం తలెత్తకుండా, బాధితులకు అవసరాలకు అనుగుణమైన ఆహారం ఇవ్వటానికి ప్రాధాన్యం పెరుగుతోంది. ఇలాంటి ఆహారంతో లభించే ప్రయోజనాల మీద ఇప్పటివరకూ పెద్దగా అధ్యయనాలు సాగలేదు.

ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్‌ ఆసుపత్రుల్లో పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు. ఆసుపత్రి క్యాంటీన్లలో లభించే మామూలు ఆహారం తిన్నవారితో పోలిస్తే అవసరాలకు తగిన ఆహారం తీసుకున్నవారిలో చికిత్స ఫలితాలు మరింత మెరుగ్గా ఉండటం విశేషం. దుష్ప్రభావాలు, మరణాలు సైతం తగ్గటం గమనార్హం. తీవ్రమైన జబ్బులతో బాధపడేవారి విషయంలో ఆహార చికిత్సకూ ప్రాధాన్యం ఇవ్వటం ఎంతైనా అవసరమని ఫలితాలు సూచిస్తున్నాయి.

ఇదీ చూడండి: ఎక్కువ కాలం బతకాలంటే ఇవి తినండి!

ఆసుపత్రిలో చేరినవారికి మందులు మాత్రమే కాదు, తిండీ ముఖ్యమే. అది ఆయా వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా ఉన్నదైతే ఇంకా మంచిదని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. చికిత్స ఫలితాలు మెరుగుపడటానికి, జబ్బుల దుష్ప్రభావాలు తగ్గటానికి, త్వరగా కోలుకోవటానికిది దోహదం చేస్తుంది.

ఏదైనా జబ్బుతో ఆసుపత్రిలో చేరినప్పుడు తినటానికి, తాగటానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. దీంతో శరీరానికి తగినంతగా ప్రొటీన్లు, శక్తి అందవు. ఫలితంగా చికిత్స తీసుకుంటున్నా అంతగా గుణం కనిపించకపోవచ్ఛు జబ్బు ముదురుతుండొచ్ఛు దుష్ప్రభావాల ముప్పు పెరగొచ్ఛు కొన్నిసార్లు ప్రాణాపాయానికీ దారితీయొచ్ఛు అందుకే పోషణలోపం తలెత్తకుండా, బాధితులకు అవసరాలకు అనుగుణమైన ఆహారం ఇవ్వటానికి ప్రాధాన్యం పెరుగుతోంది. ఇలాంటి ఆహారంతో లభించే ప్రయోజనాల మీద ఇప్పటివరకూ పెద్దగా అధ్యయనాలు సాగలేదు.

ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్‌ ఆసుపత్రుల్లో పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు. ఆసుపత్రి క్యాంటీన్లలో లభించే మామూలు ఆహారం తిన్నవారితో పోలిస్తే అవసరాలకు తగిన ఆహారం తీసుకున్నవారిలో చికిత్స ఫలితాలు మరింత మెరుగ్గా ఉండటం విశేషం. దుష్ప్రభావాలు, మరణాలు సైతం తగ్గటం గమనార్హం. తీవ్రమైన జబ్బులతో బాధపడేవారి విషయంలో ఆహార చికిత్సకూ ప్రాధాన్యం ఇవ్వటం ఎంతైనా అవసరమని ఫలితాలు సూచిస్తున్నాయి.

ఇదీ చూడండి: ఎక్కువ కాలం బతకాలంటే ఇవి తినండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.