ETV Bharat / sukhibhava

ప్రెగ్నెన్సీ ఒత్తిళ్లను ఇలా జయించండి...

author img

By

Published : May 17, 2020, 8:48 AM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

నిత్యజీవితంలో మనం ఎదుర్కొనే ఒత్తిళ్లు ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతాయి. గర్భిణీల విషయంలో అయితే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధిగమించడానికి తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు గురించి... ప్రముఖ గైనకాలజిస్టు డా.బాలాంబ సూచనలు మీ కోసం.

How to overcome stress?
ఒత్తిడిని జయించడం ఎలా?

ఎప్పుడూ ఇల్లు, పిల్లలు గురించి ఆలోచించే ఆమెకు ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు! ఒత్తిళ్లు, ఊబకాయం లాంటివన్నీ అధిక రక్తపోటుకు దారితీస్తాయి. గర్భిణుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీన్ని ఆధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

ఊబకాయం, సరైన వ్యాయామం లేకపోవడం, ఆహారపు అలవాట్లు లాంటి కారణాలతో పాటు జన్యుపరంగానూ అధిక రక్తపోటు రావొచ్చు. మనదేశంలో మాతాశిశు మరణాలకు కారణమైన సమస్యల్లో ఇదీ ఒకటి. దీన్నే హైపర్‌టెన్షన్‌ డిజార్డర్స్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ అంటారు. ఇందులో చాలా రకాలు ఉన్నప్పటికీ గుర్రపువాతం మూలంగా మాతృమరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. మధుమేహంతో బాధపడేవారు, ఆలస్యంగా గర్భం దాల్చిన మహిళలు ఎక్కువగా దీని బారిన పడుతుంటారు. ఈ పరిస్థితి మొదటికాన్పులో ఎక్కువ మందికి కనిపిస్తుంది. కొందరిలో రెండో కాన్పులోనూ ఇబ్బందిపెడుతుంది.

ఎలాంటి ప్రమాదం ఉంటుంది?

  • గర్భం దాల్చిన ప్రతి ఒక్కరికీ బీపీ రావాలనీ లేదు. బీపీ ఉంటే మాత్రం ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి.
  • అధిక రక్తపోటుతో బాధపడుతున్న గర్భవతుల్లో నెలల కంటే ముందే ప్రసవం జరగొచ్చు. దాని ప్రభావం బిడ్డపైనా పడుతుంది. ఈ సమయంలో అధిక రక్తపోటు ఉంటే.. గుండెపోటు, మూర్ఛ ముప్పు ఎక్కువ. కొందరు స్త్రీల్లో మాయ విడిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.

మోనోపాజ్ తరువాత

మహిళల్లో గర్భం దాల్చిన తరువాత.. మెనోపాజ్‌ సమయంలోనే అధిక రక్తపోటు ముప్పు ఎక్కువ. అప్పటివరకూ రక్షణగా ఉన్న ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి ఆగిపోవడంతో అధిక రక్తపోటు సమస్య తీవ్రమవుతుంది. ఫలితంగా గుండెపోటు సమస్యా అధికంగా ఉంటుంది. రక్తనాళాలు చిట్లిపోవడం, రక్తం గడ్డకట్టడం లాంటి ఇబ్బందులూ ఎదురు కావొచ్చు.

అదుపులో ఉంచుకోవాలంటే..

  • ఎత్తుకి తగిన బరువు ఉండేలా చూసుకోవాలి. కొలెస్ట్రాల్‌ ఎక్కువుండే పదార్థాలకు తీసుకోవద్దు.
  • ఉప్పుని మితంగా వాడాలి. ముఖ్యంగా ప్యాక్డ్‌, ప్రాసెస్డ్‌ ఆహారం... కాఫీ, టీ, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం నిండుగా ఉండే ఆకుకూరలు, కాయగూరలతో కూడిన భోజనాన్ని ఎంచుకోవాలి. అరటిపండ్లు, కమలాఫలాలు, పుచ్చకాయలు, క్యారెట్‌, కాలీఫ్లవర్‌, పప్పుధాన్యాలు, నట్స్‌, చిక్కుళ్లు లాంటి వాటిలో ఈ పోషకాలు విరివిగా లభిస్తాయి. పాలు, పాల సంబంధిత ఉత్పత్తులు మేలు చేస్తాయి. తినే ఆహారంలో పీచు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది.
  • మానసికంగా, శారీరకంగా ఒత్తిడి పెరిగినప్పుడు రక్తపోటు స్థాయి మారుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మంచిది.
    ప్రముఖ గైనకాలజిస్టు
    డా.బాలాంబ

ఇదీ చూడండి: తుపానుగా మారిన వాయుగుండం-'ఆంఫాన్‌'గా నామకరణం

ఎప్పుడూ ఇల్లు, పిల్లలు గురించి ఆలోచించే ఆమెకు ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు! ఒత్తిళ్లు, ఊబకాయం లాంటివన్నీ అధిక రక్తపోటుకు దారితీస్తాయి. గర్భిణుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీన్ని ఆధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

ఊబకాయం, సరైన వ్యాయామం లేకపోవడం, ఆహారపు అలవాట్లు లాంటి కారణాలతో పాటు జన్యుపరంగానూ అధిక రక్తపోటు రావొచ్చు. మనదేశంలో మాతాశిశు మరణాలకు కారణమైన సమస్యల్లో ఇదీ ఒకటి. దీన్నే హైపర్‌టెన్షన్‌ డిజార్డర్స్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ అంటారు. ఇందులో చాలా రకాలు ఉన్నప్పటికీ గుర్రపువాతం మూలంగా మాతృమరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. మధుమేహంతో బాధపడేవారు, ఆలస్యంగా గర్భం దాల్చిన మహిళలు ఎక్కువగా దీని బారిన పడుతుంటారు. ఈ పరిస్థితి మొదటికాన్పులో ఎక్కువ మందికి కనిపిస్తుంది. కొందరిలో రెండో కాన్పులోనూ ఇబ్బందిపెడుతుంది.

ఎలాంటి ప్రమాదం ఉంటుంది?

  • గర్భం దాల్చిన ప్రతి ఒక్కరికీ బీపీ రావాలనీ లేదు. బీపీ ఉంటే మాత్రం ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి.
  • అధిక రక్తపోటుతో బాధపడుతున్న గర్భవతుల్లో నెలల కంటే ముందే ప్రసవం జరగొచ్చు. దాని ప్రభావం బిడ్డపైనా పడుతుంది. ఈ సమయంలో అధిక రక్తపోటు ఉంటే.. గుండెపోటు, మూర్ఛ ముప్పు ఎక్కువ. కొందరు స్త్రీల్లో మాయ విడిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.

మోనోపాజ్ తరువాత

మహిళల్లో గర్భం దాల్చిన తరువాత.. మెనోపాజ్‌ సమయంలోనే అధిక రక్తపోటు ముప్పు ఎక్కువ. అప్పటివరకూ రక్షణగా ఉన్న ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి ఆగిపోవడంతో అధిక రక్తపోటు సమస్య తీవ్రమవుతుంది. ఫలితంగా గుండెపోటు సమస్యా అధికంగా ఉంటుంది. రక్తనాళాలు చిట్లిపోవడం, రక్తం గడ్డకట్టడం లాంటి ఇబ్బందులూ ఎదురు కావొచ్చు.

అదుపులో ఉంచుకోవాలంటే..

  • ఎత్తుకి తగిన బరువు ఉండేలా చూసుకోవాలి. కొలెస్ట్రాల్‌ ఎక్కువుండే పదార్థాలకు తీసుకోవద్దు.
  • ఉప్పుని మితంగా వాడాలి. ముఖ్యంగా ప్యాక్డ్‌, ప్రాసెస్డ్‌ ఆహారం... కాఫీ, టీ, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం నిండుగా ఉండే ఆకుకూరలు, కాయగూరలతో కూడిన భోజనాన్ని ఎంచుకోవాలి. అరటిపండ్లు, కమలాఫలాలు, పుచ్చకాయలు, క్యారెట్‌, కాలీఫ్లవర్‌, పప్పుధాన్యాలు, నట్స్‌, చిక్కుళ్లు లాంటి వాటిలో ఈ పోషకాలు విరివిగా లభిస్తాయి. పాలు, పాల సంబంధిత ఉత్పత్తులు మేలు చేస్తాయి. తినే ఆహారంలో పీచు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది.
  • మానసికంగా, శారీరకంగా ఒత్తిడి పెరిగినప్పుడు రక్తపోటు స్థాయి మారుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మంచిది.
    ప్రముఖ గైనకాలజిస్టు
    డా.బాలాంబ

ఇదీ చూడండి: తుపానుగా మారిన వాయుగుండం-'ఆంఫాన్‌'గా నామకరణం

Last Updated : May 21, 2020, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.