ETV Bharat / state

సూర్య గ్రహణం: యాదాద్రి ఆలయం మూసివేత

రేపు సూర్యగ్రహణం సందర్భంగా... యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఇవాళ రాత్రి 8 గంటలకు మూసివేయనున్నారు. తిరిగి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తెరిచి, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు దర్శనాలు కల్పించనున్నారు.

author img

By

Published : Jun 20, 2020, 4:31 PM IST

Updated : Jun 20, 2020, 9:06 PM IST

yadadri temple close
సూర్య గ్రహణం: యాదాద్రి ఆలయం మూసివేత

తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని... రేపు రాహుగ్రస్త చూడామణి నామక సూర్య గ్రహణం సందర్భంగా ఈరోజు రాత్రి మూసివేయనున్నారు. యథావిథిగా ఇవాళ స్వామివారికి ఆరగింపు నిర్వహించి రాత్రి 8 గంటలకు మూసివేయనున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. రేపు ఉదయం 10 గంటల 18 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట 49 నిమిషాల వరకు సూర్య గ్రహణం ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు.

ఆలయంలో సంప్రోక్షణ శుద్ధి ఆరాధన ఆరగింపు చేసి... సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు భక్తులకు దర్శనాలు అనుమతించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి యథావిథిగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా గర్భిణీలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గ్రహణం ప్రారంభానికి ముందే కాలకృత్యాలు తీర్చుకొని, పెద్దవారి సహకారం తీసుకోవాలని సూచించారు.

భద్రాద్రి రాములవారి ఆలయాన్ని కూడా మూసివేశారు. గ్రహణం పూర్తైన తర్వాత.. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు భక్తులకు అనుమతిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలు... బాసర జ్ఞాన సరస్వతిదేవీ ఆలయం, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వరం ముక్తీశ్వరాలయం, ఆలంపూరు జోగులాంబ ఆలయం, కీసర, చెర్వుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాలు మూసివేశారు.

ఇదీ చూడండి: ఎమ్మెల్యే రాజాసింగ్​ గన్​మెన్​కు కరోనా పాజిటివ్

తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని... రేపు రాహుగ్రస్త చూడామణి నామక సూర్య గ్రహణం సందర్భంగా ఈరోజు రాత్రి మూసివేయనున్నారు. యథావిథిగా ఇవాళ స్వామివారికి ఆరగింపు నిర్వహించి రాత్రి 8 గంటలకు మూసివేయనున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. రేపు ఉదయం 10 గంటల 18 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట 49 నిమిషాల వరకు సూర్య గ్రహణం ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు.

ఆలయంలో సంప్రోక్షణ శుద్ధి ఆరాధన ఆరగింపు చేసి... సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు భక్తులకు దర్శనాలు అనుమతించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి యథావిథిగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా గర్భిణీలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గ్రహణం ప్రారంభానికి ముందే కాలకృత్యాలు తీర్చుకొని, పెద్దవారి సహకారం తీసుకోవాలని సూచించారు.

భద్రాద్రి రాములవారి ఆలయాన్ని కూడా మూసివేశారు. గ్రహణం పూర్తైన తర్వాత.. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు భక్తులకు అనుమతిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలు... బాసర జ్ఞాన సరస్వతిదేవీ ఆలయం, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వరం ముక్తీశ్వరాలయం, ఆలంపూరు జోగులాంబ ఆలయం, కీసర, చెర్వుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాలు మూసివేశారు.

ఇదీ చూడండి: ఎమ్మెల్యే రాజాసింగ్​ గన్​మెన్​కు కరోనా పాజిటివ్

Last Updated : Jun 20, 2020, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.