ETV Bharat / state

Yadadri Brahmotsavalu 2022: ఆరోరోజు అట్టహాసంగా యాదాద్రీశుని బ్రహ్మోత్సవాలు

author img

By

Published : Mar 10, 2022, 10:19 AM IST

Updated : Mar 10, 2022, 10:33 AM IST

Yadadri Brahmotsavalu 2022: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. బుధవారం ఆరో రోజు సాయంత్రం.. యోగానంద నరసింహస్వామి అలంకారంలో స్వామి వారిని సింహ వాహనంపై ఊరేగించారు. వజ్ర వైఢూర్యాలు, వివిధ రకాల పుష్పాలతో యాదాద్రీశుని సర్వాంగ సుందరంగా అలంకరించారు. విద్యుద్దీపాల అలంకరణతో బాలాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Yadadri Brahmotsavam
యాదాద్రి బ్రహ్మోత్సవాలు 2022

Yadadri Brahmotsavalu 2022: యాదాద్రీశుని వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరోరోజు అట్టహాసంగా కొనసాగాయి. బుధవారం ఉదయం గోవర్దనగిరిధారి అవతారంలో భక్తులకు అభయమిచ్చిన స్వామి వారు.. సాయంత్రం యోగానంద నరసింహస్వామి అలంకారంలో సింహ వాహన సేవపై కొలువుదీరారు. విద్యుద్దీపాలంకరణతో ముస్తాబైన బాలాలయం.. ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వాహన సేవలపై ఊరేగిస్తున్నారు.

Yadadri Brahmotsavam
సింహ వాహన సేవపై యాదాద్రీశుడు

నయన మనోహరం

వజ్రవైఢూర్యాలు, వివిధ రకాల పుష్పాలతో యాదాద్రీశుడిని నయనమనోహరంగా అలంకరించిన ఆలయ అర్చకులు.. సింహవాహన సేవపై ఊరేగించారు. వేదమంత్రాలు, పారాయణాలు, మంగళవాయిద్యాల నడుమ బాలాలయంలో సేవపై ఊరేగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు సింహ వాహనసేవ విశిష్టత తెలియజేశారు.

Yadadri Brahmotsavam
బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెలుగులీనుతున్న బాలాలయం

12న రథోత్సవం

11 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలు ఈ నెల 14 న ముగుస్తాయి. నేడు స్వామి వారికి ఎదుర్కోలు‌, 11 న తిరుకల్యాణం, 12 న రథోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని విద్యుత్ దీపాల అలంకరణతో ముస్తాబు చేశారు. బాలాలయ ప్రాంగణం, పరిసరాలలో రాత్రి వేళలో కాంతులు విరజిమ్మేలా విద్యత్ దీపాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొండకింద పట్టణంలో ప్రధాన రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ.. వెలుగులు సంతరించుకొని చూపరులను ఆకట్టుకుంటోంది.

ఇదీ చదవండి: యూపీ, ఉత్తరాఖండ్​లో భాజపా జోరు.. పంజాబ్​లో ఆప్​కు స్పష్టమైన ఆధిక్యం

Yadadri Brahmotsavalu 2022: యాదాద్రీశుని వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరోరోజు అట్టహాసంగా కొనసాగాయి. బుధవారం ఉదయం గోవర్దనగిరిధారి అవతారంలో భక్తులకు అభయమిచ్చిన స్వామి వారు.. సాయంత్రం యోగానంద నరసింహస్వామి అలంకారంలో సింహ వాహన సేవపై కొలువుదీరారు. విద్యుద్దీపాలంకరణతో ముస్తాబైన బాలాలయం.. ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వాహన సేవలపై ఊరేగిస్తున్నారు.

Yadadri Brahmotsavam
సింహ వాహన సేవపై యాదాద్రీశుడు

నయన మనోహరం

వజ్రవైఢూర్యాలు, వివిధ రకాల పుష్పాలతో యాదాద్రీశుడిని నయనమనోహరంగా అలంకరించిన ఆలయ అర్చకులు.. సింహవాహన సేవపై ఊరేగించారు. వేదమంత్రాలు, పారాయణాలు, మంగళవాయిద్యాల నడుమ బాలాలయంలో సేవపై ఊరేగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు సింహ వాహనసేవ విశిష్టత తెలియజేశారు.

Yadadri Brahmotsavam
బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెలుగులీనుతున్న బాలాలయం

12న రథోత్సవం

11 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలు ఈ నెల 14 న ముగుస్తాయి. నేడు స్వామి వారికి ఎదుర్కోలు‌, 11 న తిరుకల్యాణం, 12 న రథోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని విద్యుత్ దీపాల అలంకరణతో ముస్తాబు చేశారు. బాలాలయ ప్రాంగణం, పరిసరాలలో రాత్రి వేళలో కాంతులు విరజిమ్మేలా విద్యత్ దీపాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొండకింద పట్టణంలో ప్రధాన రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ.. వెలుగులు సంతరించుకొని చూపరులను ఆకట్టుకుంటోంది.

ఇదీ చదవండి: యూపీ, ఉత్తరాఖండ్​లో భాజపా జోరు.. పంజాబ్​లో ఆప్​కు స్పష్టమైన ఆధిక్యం

Last Updated : Mar 10, 2022, 10:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.