యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా యాదాద్రి ప్రధాన ఆలయం చుట్టూ భూగర్భ డ్రైనేజీ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రధాన ఆలయం లోపల నుంచి వచ్చే వ్యర్థ జలాలు బయటకు వెళ్లేలా ప్రత్యేక భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్లను నిర్మిస్తున్నారు.
ప్రధాన ఆలయం ఆవరణలో వర్షం కురిసినప్పుడు వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా ప్రత్యేక భూగర్భ మురుగు కాలువలను నిర్మిస్తున్నారు. పడిన వర్షం నీరు నిలవకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్టామ్ వాటర్, డ్రైనేజీ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. శివాలయంలో కూడా భూగర్భ డ్రైనేజీ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఇవీ చూడండి: దావోస్లో కేటీఆర్ బిజీ.. పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు