ETV Bharat / state

కలెక్టరే​ పట్టించుకోకుంటే ఇంకెవరిని అడగాలి ? - వ్యవసాయ ఉత్పత్తులు

కాలుష్య పరిశ్రమను తరలించాలని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ముందు స్థానికులు ఆందోళనకు దిగారు. అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు.

వెంటనే పరిశ్రమను తరలించాలి : విద్యార్థులు
author img

By

Published : Jul 8, 2019, 10:53 PM IST

కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమను వెంటనే మూసేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట విద్యార్థులు ,ప్రజలు ధర్నా చేశారు. చౌటుప్పల్ పురపాలక పరిధి తంగడపల్లిలోని జంతు కళేబరాల వ్యర్థాలతో వ్యవసాయ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఆ పరిశ్రమ నుంచి గత కొన్ని నెలలుగా విపరీతమైన దుర్వాసన, కాలుష్యం వెలువడుతున్నాయని స్థానికులు ఆందోళనకు దిగారు.
ఎన్ని సార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా, కలెక్టర్​కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న దుర్వాసనను భరించలేకపోతున్నామని, కలుషితమైన గాలి పీల్చుకోలేక సతమతమవుతున్నామన్నారు. వెంటనే పరిశ్రమను తరలించాలని ఆర్డీవోకు వినతి పత్రం అందించారు.

అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఏ అధికారి పట్టించుకోలేదు

ఇవీ చూడండి : దివ్యాంగుడికి ఎన్‌ఆర్‌ఐల ఆర్థిక సాయం

కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమను వెంటనే మూసేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట విద్యార్థులు ,ప్రజలు ధర్నా చేశారు. చౌటుప్పల్ పురపాలక పరిధి తంగడపల్లిలోని జంతు కళేబరాల వ్యర్థాలతో వ్యవసాయ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఆ పరిశ్రమ నుంచి గత కొన్ని నెలలుగా విపరీతమైన దుర్వాసన, కాలుష్యం వెలువడుతున్నాయని స్థానికులు ఆందోళనకు దిగారు.
ఎన్ని సార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా, కలెక్టర్​కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న దుర్వాసనను భరించలేకపోతున్నామని, కలుషితమైన గాలి పీల్చుకోలేక సతమతమవుతున్నామన్నారు. వెంటనే పరిశ్రమను తరలించాలని ఆర్డీవోకు వినతి పత్రం అందించారు.

అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఏ అధికారి పట్టించుకోలేదు

ఇవీ చూడండి : దివ్యాంగుడికి ఎన్‌ఆర్‌ఐల ఆర్థిక సాయం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.