ETV Bharat / state

కేసీఆర్ క్షేమంగా ఉండాలని మంత్రి సత్యవతి పూజలు

author img

By

Published : May 3, 2021, 2:07 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోశ్​లు క్షేమంగా ఉండాలని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని కోరుకున్నట్లు మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. కరోనా బారి నుంచి వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

tribal welfare minister satyavathi rathode, minister satyavathi rathode, yadadri temple, minister satyavathi visited yadadri
యాదాద్రీశుడి సేవలో మంత్రి సత్యవతి, యాదాద్రిలో మంత్రి సత్యవతి, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని మంత్రి సత్యవతి రాఠోడ్ దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోశ్​లు ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. కరోనా బారి నుంచి త్వరగా బయటపడాలని వేడుకున్నట్లు చెప్పారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని మరోసారి రుజువైందని సత్యవతి అన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ప్రజలు తెరాసకే పట్టం కడతారని ధీమావ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు సీఎం కేసీఆర్​కు మరింత శక్తి ఇవ్వాలని యాదాద్రీశుణ్ని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని మంత్రి సత్యవతి రాఠోడ్ దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోశ్​లు ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. కరోనా బారి నుంచి త్వరగా బయటపడాలని వేడుకున్నట్లు చెప్పారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని మరోసారి రుజువైందని సత్యవతి అన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ప్రజలు తెరాసకే పట్టం కడతారని ధీమావ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు సీఎం కేసీఆర్​కు మరింత శక్తి ఇవ్వాలని యాదాద్రీశుణ్ని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.