యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జూలూర ప్రాథమిక సహకార సంఘం పరిధిలో ఎరువులు, విత్తనాల సరఫరా కేంద్రాలను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంభించారు. జూలూరు పరిధిలోని పిల్లాయిపల్లి, జగత్పల్లి, పెద్ద రావులపల్లి గ్రామాల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు.
రైతులకు వానకాలం సాగుకు కావాల్సినవన్నీ ఆయా గ్రామాల్లోనే దొరుకుతాయని, రైతులు కంగారు పడి.. ఇతరుల దగ్గర విత్తనాలు, ఎరువులు కొని మోసపోవద్దని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, జూలూరు పీఏసీఎస్ ఛైర్మన్ లింగం యాదవ్, పోచంపల్లి మున్సిపల్ ఛైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్, రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: తెలంగాణపై కరోనా పంజా... నిన్న ఒక్కరోజే 169 కేసులు