యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ ఛైర్మన్గా ఎలిమినేటి సందీప్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. వైస్ ఛైర్మన్గా బీకు నాయక్ బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ నూతన సభ్యులచేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గొంగిడి సునీత, పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి హాజరయ్యారు. నూతన సభ్యులకు అభినందనలు తెలిపారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరవ్వడం వల్ల పరిషత్ ప్రాంగణమంతా సందడిగా మారింది.
- ఇదీ చూడండి : 'ఏకీకృత రవాణా వ్యవస్థ' కోసం ప్రత్యేక విధానం