యాదాద్రి భువనగరి జిల్లాలో కొలువై ఉన్న యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి బాల ఆలయంలో ఏకాంత సేవలో స్వామి, అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అర్చించారు.
ప్రతి మాసంలోని శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి పర్వదినాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజా క్రతువు నిర్వహించడం ఆనవాయితీ. కరోనా ప్రభావం వల్ల భక్తులను అనుమతించలేదు. అర్చకుల సమక్షంలో పూజలు చేశారు.
ఇవీ చూడండి: ర్యాపిడ్ టెస్టింగ్ కిట్తో ఇంటివద్దే కరోనా పరీక్షలు