ETV Bharat / state

యాదాద్రి అర్చకులతో రామగుండం ఎమ్మెల్యే వాగ్వాదం! - Yadadri Bhuvanagiri News

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ.. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అర్చకులతో వాగ్వాదానికి దిగారు. ఆయన యాదాద్రి స్వామివారి దర్శనానికి వచ్చిన సమయంలో నిత్యకల్యాణం జరుగుతుంది. ఎమ్మెల్యేను దర్శనానికి అనుమతించకపోవడం వల్ల ఆయన అర్చకుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLA Korukanti Chandar Conflict with Yadadri Priests
యాదాద్రి అర్చకులతో రామగుండం ఎమ్మెల్యే వాగ్వాదం!
author img

By

Published : Aug 25, 2020, 10:55 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో గల శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడానికి రామగుండు ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ యాదాద్రి క్షేత్రానికి చేరుకున్నారు. ఆయన దర్శనానికి వెళ్లిన సమయంలో స్వామి వారి నిత్య కల్యాణం జరుగుతున్నది. ఎమ్మెల్యే చందర్​ని లోపలికి పంపిచక పోవడం వల్ల ఆయన ఆలయ అర్చకుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. గమనించిన ఆలయ అధికారులు స్వామివారి కల్యాణాన్ని కొంతసేపు నిలిపివేసి, ఆలయంలో పాటిస్తున్న కొవిడ్ నిబంధనల గూర్చి, భక్తులకు అమలు చేస్తున్న లఘుదర్శనం గురించి వివరించారు.

స్వామివారికి ప్రతి నిత్యం పూజలు జరిపే ఆన్​లైన్​లో బుక్​ చేసుకున్న భక్తుల కోసం పరోక్ష పద్ధతి ద్వారా జరుపుతున్నట్టు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను శాంతింపజేశారు. స్వామి దర్శనం చేయించారు. ఆలయ అర్చకులతో ఎమ్మెల్యేకు ఆశీర్వచనం చేయించారు.
ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి బాలాలయంలోని స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించి పూజలు చేశారు. అర్చకులు ఆయనకు స్వామి వారి, తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో గల శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడానికి రామగుండు ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ యాదాద్రి క్షేత్రానికి చేరుకున్నారు. ఆయన దర్శనానికి వెళ్లిన సమయంలో స్వామి వారి నిత్య కల్యాణం జరుగుతున్నది. ఎమ్మెల్యే చందర్​ని లోపలికి పంపిచక పోవడం వల్ల ఆయన ఆలయ అర్చకుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. గమనించిన ఆలయ అధికారులు స్వామివారి కల్యాణాన్ని కొంతసేపు నిలిపివేసి, ఆలయంలో పాటిస్తున్న కొవిడ్ నిబంధనల గూర్చి, భక్తులకు అమలు చేస్తున్న లఘుదర్శనం గురించి వివరించారు.

స్వామివారికి ప్రతి నిత్యం పూజలు జరిపే ఆన్​లైన్​లో బుక్​ చేసుకున్న భక్తుల కోసం పరోక్ష పద్ధతి ద్వారా జరుపుతున్నట్టు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను శాంతింపజేశారు. స్వామి దర్శనం చేయించారు. ఆలయ అర్చకులతో ఎమ్మెల్యేకు ఆశీర్వచనం చేయించారు.
ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి బాలాలయంలోని స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించి పూజలు చేశారు. అర్చకులు ఆయనకు స్వామి వారి, తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

ఇవీ చూడండి: దిల్లీలో ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి హర్​దీప్​సింగ్​ పూరీతో భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.