ETV Bharat / state

రెండ్రోజుల్లో సొంతూరికి వెళ్లేవాడు... అంతలోనే.. - వలస కార్మికుల కష్టాలు

లాక్​డౌన్ నేపథ్యంలో సొంత రాష్ట్రాలకు వెళ్లే వారి పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది. వెళ్లేందుకు రవాణా లేక, ప్రైవేటు వాహనాలు కట్టించుకునే డబ్బులు లేక... నడకను ప్రారంభించి గమ్యం చేరక ముందే ప్రాణాలు వదిలేస్తున్నారు.

migrant-worker-dead-with-heart-attack-at-chotuppal
రెండ్రోజుల్లో సొంతూరికి వెళ్లేవాడు... కానీ ఈలోపే...
author img

By

Published : May 16, 2020, 12:12 PM IST

సొంత రాష్ట్రాలకు వెళ్లాలని నడక ప్రారంభించిన వలస కార్మికులను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉంచి అధికారులు వసతి ఏర్పాటు చేశారు. రైలులో వెళ్లేందుకు ఆలస్యమవుతుందనుకున్న కొందరు మళ్లీ నడకను ప్రారంభించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు.

ఛత్తీస్​ఘడ్​కు చెందిన ధనిరామ్ రాజపుత్ మాత్రం అక్కడే ఉంటున్నాడు. రెండు రోజుల్లో అతను సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు టికెట్​ కూడా బుక్​ అయింది. తన ఇంటికి చేరేలోపే... ఈ రోజు ఉదయం నీళ్లు తాగుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. గుండె పోటుతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు.

సొంత రాష్ట్రాలకు వెళ్లాలని నడక ప్రారంభించిన వలస కార్మికులను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉంచి అధికారులు వసతి ఏర్పాటు చేశారు. రైలులో వెళ్లేందుకు ఆలస్యమవుతుందనుకున్న కొందరు మళ్లీ నడకను ప్రారంభించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు.

ఛత్తీస్​ఘడ్​కు చెందిన ధనిరామ్ రాజపుత్ మాత్రం అక్కడే ఉంటున్నాడు. రెండు రోజుల్లో అతను సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు టికెట్​ కూడా బుక్​ అయింది. తన ఇంటికి చేరేలోపే... ఈ రోజు ఉదయం నీళ్లు తాగుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. గుండె పోటుతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు.

ఇవీ చూడండి: పాజిటివ్​ వ్యక్తులను కలిసిన ఎమ్మెల్యే... ఇప్పుడిదే జిల్లాలో చర్చ..!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.