ETV Bharat / state

'ఆరోగ్యశ్రీని.. శోభన్​ ఆరోగ్యశ్రీగా నామకరణం చేయండి'

author img

By

Published : Aug 8, 2020, 9:43 AM IST

కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీ పథకంలో ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్​ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. యాదగిరి గుట్ట పట్టణ కేంద్రంలో నిర్వహించిన ఆరోగ్యశ్రీ సాధన వారోత్సవాలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

manda krishna participated aarogyasri sadaka varostav celebrations at yadagirigutta in yadadri bhuvanagiri district
'కరోనా చికిత్సను చేర్చి.. శోభన్​ ఆరోగ్యశ్రీగా నామకరణం చేయండి'

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టిన రోజు కావడం వల్ల ఎమ్మార్పీఎస్​ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఆరోగ్య శ్రీ సాధన వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్​ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ అప్పట్లో ఆరోగ్యశ్రీ కోసం ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేసుకున్న ఆయన.. ఇప్పుడు కొవిడ్​ చికిత్సను ఆరోగ్య శ్రీ పథకంలో పెట్టాలని కోరారు.

దీని కోసం ఎమ్మార్పీఎస్ ద్వారా పోరాటం చేస్తామని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొవిడ్​ చికిత్సలు చెయొద్దని చెప్పిన కేసీఆర్​.. ఎమ్మెల్యేలకు పాజిటివ్​ రాగానే ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవడం సరికాదని ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీ రావడానికి గల కారణం అయిన శోభన్ అనే వ్యక్తి పేరుమీదుగా శోభన్ ఆరోగ్య శ్రీ నామకరణం చేయాలన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టిన రోజు కావడం వల్ల ఎమ్మార్పీఎస్​ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఆరోగ్య శ్రీ సాధన వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్​ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ అప్పట్లో ఆరోగ్యశ్రీ కోసం ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేసుకున్న ఆయన.. ఇప్పుడు కొవిడ్​ చికిత్సను ఆరోగ్య శ్రీ పథకంలో పెట్టాలని కోరారు.

దీని కోసం ఎమ్మార్పీఎస్ ద్వారా పోరాటం చేస్తామని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొవిడ్​ చికిత్సలు చెయొద్దని చెప్పిన కేసీఆర్​.. ఎమ్మెల్యేలకు పాజిటివ్​ రాగానే ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవడం సరికాదని ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీ రావడానికి గల కారణం అయిన శోభన్ అనే వ్యక్తి పేరుమీదుగా శోభన్ ఆరోగ్య శ్రీ నామకరణం చేయాలన్నారు.

ఇవీచూడండి: భారత్ బయోటెక్​ ల్యాబ్​ను సందర్శించిన మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.