ETV Bharat / state

18 నుంచి పాతగుట్టలో అధ్యయన, బ్రహ్మోత్సవాలు

యాదాద్రి పాతగుట్ట నారసింహుని అధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుంచి జరగనున్నాయి. ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆలయ ప్రధాన ఆలయన నిర్వాహకులు నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ ఈఓ గీతారెడ్డి.. ప్రధాన పూజారులు, అధికారులతో సమావేశం నిర్వహించారు.

author img

By

Published : Feb 6, 2021, 11:23 AM IST

yadadri
యాదాద్రి పాతగుట్ట

యాదాద్రి పుణ్యక్షేత్రానికి అనుబంధమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ వార్షికోత్సవాలు.. సంప్రదాయ పర్వాలతో ఘనంగా జరపాలని ప్రధాన ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం ఈఓ గీతారెడ్డి.. వివిధ విభాగాల ఏఈఓలు, పర్యవేక్షకులు, ప్రధాన పూజారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఏటేటా జరిగే బ్రహ్మోత్సవాలకు ముందస్తుగా అధ్యయనోత్సవాలు నిర్వహిస్తారు. వరుసగా కొనసాగే ఈ ఉత్సవాలు ఈ నెల 18న మొదలవుతాయి. కొవిడ్ నిబంధనల ప్రకారం ఉత్సవాలను చేపట్టాలని నిర్ణయించారు. 18 నుంచి 21 వరకు అధ్యయనోత్సవాలు, 22 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు, పూజారులు తెలిపారు.

యాదాద్రి పుణ్యక్షేత్రానికి అనుబంధమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ వార్షికోత్సవాలు.. సంప్రదాయ పర్వాలతో ఘనంగా జరపాలని ప్రధాన ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం ఈఓ గీతారెడ్డి.. వివిధ విభాగాల ఏఈఓలు, పర్యవేక్షకులు, ప్రధాన పూజారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఏటేటా జరిగే బ్రహ్మోత్సవాలకు ముందస్తుగా అధ్యయనోత్సవాలు నిర్వహిస్తారు. వరుసగా కొనసాగే ఈ ఉత్సవాలు ఈ నెల 18న మొదలవుతాయి. కొవిడ్ నిబంధనల ప్రకారం ఉత్సవాలను చేపట్టాలని నిర్ణయించారు. 18 నుంచి 21 వరకు అధ్యయనోత్సవాలు, 22 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు, పూజారులు తెలిపారు.

ఇదీ చదవండి: ముగిసిన ధాన్యం కొనుగోళ్లు.. సేకరణలో రికార్డు.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.