ETV Bharat / state

యాదాద్రిలో ప్లవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం - Plava Nama samvastara panchangam

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో పండితులు పంచాంగ శ్రవణం చేశారు. విశ్వమంతటికి రాజైన స్వామివారి అధీనంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి, పంటలు అభివృద్ధి చెందుతాయని ప్లవ నామ సంవత్సర పంచాంగం తెలిపింది.

Plava Nama samvastara panchangam in yadadri temple
యాదాద్రిలో ప్లవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం
author img

By

Published : Apr 13, 2021, 10:16 PM IST

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ప్లవ నామ సంవత్సర పంచాంగాన్ని వేదపండితులు శ్రవణం చేశారు. పాడి, పశుసంపద, పంటలు సుభిక్షంగా పండుతాయని పేర్కొన్నారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం, తులారాశి వారికి స్వామి వారి అద్భుత కటాక్షం ఉందని తెలిపారు. విశ్వమంతటికి రాజైన స్వామివారి ఆశిస్సులతో అన్ని వర్గాల ప్రజలకు శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పారు.

రైతులకు శుభప్రదంగా ఉంటుందని, ఋతుపవనాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ వర్షాలు బాగానే కురుస్తాయని అన్నారు. అంతకు ముందు బాలాలయంలో స్వామివారిని ప్రత్యేకంగా పట్టు వస్త్రాలతో అలంకరించారు.

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ప్లవ నామ సంవత్సర పంచాంగాన్ని వేదపండితులు శ్రవణం చేశారు. పాడి, పశుసంపద, పంటలు సుభిక్షంగా పండుతాయని పేర్కొన్నారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం, తులారాశి వారికి స్వామి వారి అద్భుత కటాక్షం ఉందని తెలిపారు. విశ్వమంతటికి రాజైన స్వామివారి ఆశిస్సులతో అన్ని వర్గాల ప్రజలకు శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పారు.

రైతులకు శుభప్రదంగా ఉంటుందని, ఋతుపవనాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ వర్షాలు బాగానే కురుస్తాయని అన్నారు. అంతకు ముందు బాలాలయంలో స్వామివారిని ప్రత్యేకంగా పట్టు వస్త్రాలతో అలంకరించారు.

ఇదీ చదవండి: మే తర్వాత కరోనా ఉద్ధృతి తగ్గుతుంది: పంచాంగ శ్రవణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.