నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవటానికి తెరాస పార్టీకి చెందిన 6 గురు మంత్రులు ఇక్కడే మకాం వేసి క్యాంపు రాజకీయాలకు పాల్పడుతున్నట్లు కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. భువనగిరి లోక్సభ స్థానంలో కాంగ్రెస్ 80 వేల నుంచి లక్షకు పైగా మెజార్టీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 5 నుంచి 6 ఎంపీ సీట్లను గెలుస్తామని జోస్యం చెప్పారు. ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ జరిగిందన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: ఎన్నికల కమిషన్కు హైకోర్టు మొట్టికాయలు