మూసీ, రసాయన పరిశ్రమల కాలుష్యానికి వ్యతిరేకంగా జాగో తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో సమర భేరి మోగించేందుకు కార్యాచరణ ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో జాగో తెలంగాణ ఆధ్వర్యంలో కాలుష్యంపై సమర భేరి సభ నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా ఈ నెల 27 నుంచి 31 వరకు కాలుష్య పీడిత గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
జనవరి 1న కాలుష్య సమస్యపై రూపొందించిన డాక్యుమెంట్ను విడుదల చేస్తామని జాగో కన్వీనర్ జిట్టా బాలకృష్ణ తెలిపారు. జనవరి 1 నుంచి 5 వరకు మండల స్థాయిలో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రలు అందజేయాలని సూచించారు. 7 నుంచి 11 వరకు గ్రామాల్లో ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి : పౌర చట్టంపై వారం రోజులు నిరసనలు: ఉత్తమ్