ETV Bharat / state

Heavy Rush at Yadadri Temple: సండే స్పెషల్.. నారసింహుని సన్నిధిలో భక్తుల సందడి

author img

By

Published : Dec 12, 2021, 5:18 PM IST

Updated : Dec 12, 2021, 5:29 PM IST

Heavy Rush at Yadadri Temple: ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొండపైన ఎక్కడ చూసినా భక్తుల సందడి నెలకొంది. స్వామివారి ధర్మదర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట సమయం పట్టింది.

Yadadri temple latest news: సండే స్పెషల్.. నారసింహుని సన్నిధిలో భక్తుల సందడి
Yadadri temple latest news: సండే స్పెషల్.. నారసింహుని సన్నిధిలో భక్తుల సందడి

Heavy Rush at Yadadri Temple: యాదాద్రిలో లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. బాలాలయ సముదాయాలు, మండపాలు సందడిగా కనిపించాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రిలో రద్దీ నెలకొంది. నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. రద్దీ దృష్ట్యా అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించలేదు. స్వామివారి ధర్మదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తుల రద్దీ కారణంగా లడ్డు ప్రసాద కౌంటర్​ భక్తులతో నిండిపోయింది. లడ్డు కొనుగోలు చేసిన భక్తులకు కవర్​లో ఇవ్వకుండా నేరుగా చేతికి లడ్డూలు ఇవ్వడంతో అసహనానికి గురయ్యారు. అనంతరం దాదాపు అరగంటకు పైగా లడ్డు ప్రసాదం లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.

కవర్​లో ఇవ్వకుండా నేరుగా చేతికి లడ్డూలు
కవర్​లో ఇవ్వకుండా నేరుగా చేతికి లడ్డూలు

ఉదయం నాలుగు గంటలకే పూజలు ప్రారంభం

Heavy rush at yadadri temple: ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మొదలైంది. ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపారు. కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పోటెత్తిన భక్తజనం
పోటెత్తిన భక్తజనం

శాస్త్రోక్తంగా నిత్యపూజలు

మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం చేశారు. కొండ కింద పాతగోశాల వద్ద వ్రత మండపంలో జరిగిన సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో నిత్యపూజలు శాస్త్రోక్తంగా జరిగాయి.

ఇదీ చదవండి:

Yadadri Drone Visuals: పనుల పరుగులు.. యాదాద్రి క్షేత్రానికి తుది మెరుగులు

Heavy Rush at Yadadri Temple: యాదాద్రిలో లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. బాలాలయ సముదాయాలు, మండపాలు సందడిగా కనిపించాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రిలో రద్దీ నెలకొంది. నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. రద్దీ దృష్ట్యా అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించలేదు. స్వామివారి ధర్మదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తుల రద్దీ కారణంగా లడ్డు ప్రసాద కౌంటర్​ భక్తులతో నిండిపోయింది. లడ్డు కొనుగోలు చేసిన భక్తులకు కవర్​లో ఇవ్వకుండా నేరుగా చేతికి లడ్డూలు ఇవ్వడంతో అసహనానికి గురయ్యారు. అనంతరం దాదాపు అరగంటకు పైగా లడ్డు ప్రసాదం లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.

కవర్​లో ఇవ్వకుండా నేరుగా చేతికి లడ్డూలు
కవర్​లో ఇవ్వకుండా నేరుగా చేతికి లడ్డూలు

ఉదయం నాలుగు గంటలకే పూజలు ప్రారంభం

Heavy rush at yadadri temple: ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మొదలైంది. ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపారు. కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పోటెత్తిన భక్తజనం
పోటెత్తిన భక్తజనం

శాస్త్రోక్తంగా నిత్యపూజలు

మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం చేశారు. కొండ కింద పాతగోశాల వద్ద వ్రత మండపంలో జరిగిన సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో నిత్యపూజలు శాస్త్రోక్తంగా జరిగాయి.

ఇదీ చదవండి:

Yadadri Drone Visuals: పనుల పరుగులు.. యాదాద్రి క్షేత్రానికి తుది మెరుగులు

Last Updated : Dec 12, 2021, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.