ETV Bharat / state

Gold donation to Yadadri: యాదాద్రికి భారీగా బంగారం విరాళం.. ఎవరెవరు ఎంతెంత ఇచ్చారంటే? - gold donation to Yadadri news

యాదాద్రి ఆలయ (Yadadri Temple )విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం భారీగా బంగారం విరాళాలు (Gold donation to Yadadri) వెల్లువెత్తుతున్నాయి. తొలి రోజే 22 కిలోల బంగారం (22kg gold donate) విరాళంగా సమకూరింది. ముఖ్యమంత్రి (cm KCR ) తొలి విరాళం కిలో 16 తులాల బంగారం ప్రకటించిన కొన్ని గంటల్లోనే తామూ బంగారం ఇచ్చేందుకు పలువురు దాతలు ముందుకొచ్చారు. వారు ఎవరెవరంటే...?

Gold donation to Yadadri
యాదాద్రికి భారీగా బంగారం విరాళం.. ఎవరు ఎంతంటే?
author img

By

Published : Oct 20, 2021, 7:10 AM IST

Updated : Oct 20, 2021, 9:09 AM IST

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ (Yadadri Lakshmi Narasimha Swamy Temple) విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం 125 కిలోల బంగారం అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)​ తెలిపారు. ప్రతీ గ్రామాన్ని ఇందులో భాగస్వామ్యం చేయాలన్నారు. ముఖ్యమంత్రి తొలి విరాళం కిలో 16 తులాల బంగారం ప్రకటించిన కొన్ని గంటల్లోనే తామూ బంగారం ఇచ్చేందుకు పలువురు దాతలు ముందుకొచ్చారు. వీరిలో కొందరి పేర్లను ముఖ్యమంత్రి మంగళవారం యాదాద్రి పర్యటన సందర్భంగా స్వయంగా ప్రకటించారు. ఒక్కరోజులోనే సుమారు 22 కిలోల పసిడి విరాళంగా (22kg gold donate) సమకూరింది.

'యాదాద్రికి మా కుటుంబం తరఫున కిలో 16 తులాల బంగారం ఇస్తా. తొలి విరాళంగా మా కుటుంబం బంగారం విరాళమిస్తుంది. మంత్రి మల్లారెడ్డి కిలో బంగారం ఇస్తామన్నారు. మేడ్చల్‌ ప్రజల తరఫున మల్లారెడ్డి మరో కిలో బంగారం ఇస్తామన్నారు. నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి 2 కిలోల బంగారం ఇస్తామన్నారు. కావేరీ సీడ్స్‌ తరఫున భాస్కర్‌రావు కిలో బంగారం ఇస్తామన్నారు. దామోదర్‌రావు కిలో బంగారం విరాళం ఇస్తామన్నారు. చాలా మంది కిలో బంగారం చొప్పున కానుక ఇస్తామన్నారు. చినజీయర్‌స్వామి పీఠం నుంచి కిలో బంగారం ఇస్తామన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కిలో బంగారం ఇస్తామన్నారు. యావత్‌ ప్రజానీకంలో యాదాద్రి తమదనే భావం రావాలి.'

-- యాదాద్రిలో సీఎం కేసీఆర్

హెటిరో చైర్మ‌న్ పార్థ సార‌ధి రెడ్డి 5 కిలోల బంగారం

ముఖ్యమంత్రి కేసీఆర్​ చూపిన స్ఫూర్తితో యాదాద్రి విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం హెటెరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ పార్థసారథిరెడ్డి 5 కిలోల బంగారాన్ని (5KG Gold donation to Yadadri) విరాళమివ్వనున్నట్లు ప్రకటించారు. త‌న కుటుంబం త‌ర‌పున ఈ విరాళం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భారీ విరాళం

సిద్దిపేట నియోజకవర్గ ప్రజల తరఫున కిలో బంగారం ఇస్తామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మైనంపల్లి హన్మంతరావు, మాధవరం కృష్ణారావు, వివేకానంద్‌, ఎమ్మెల్సీలు కె.నవీన్‌ కుమార్‌, శంభీపూర్‌ రాజు, ఏపీలోని కడప జిల్లా చిన్న మండెం జడ్పీటీసీ సభ్యురాలు, వ్యాపారవేత్త మోడెం జయమ్మ ఒక్కొక్కరు కిలో బంగారం చొప్పున ఇస్తామని ప్రకటించారు.

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ (Yadadri Lakshmi Narasimha Swamy Temple) విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం 125 కిలోల బంగారం అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)​ తెలిపారు. ప్రతీ గ్రామాన్ని ఇందులో భాగస్వామ్యం చేయాలన్నారు. ముఖ్యమంత్రి తొలి విరాళం కిలో 16 తులాల బంగారం ప్రకటించిన కొన్ని గంటల్లోనే తామూ బంగారం ఇచ్చేందుకు పలువురు దాతలు ముందుకొచ్చారు. వీరిలో కొందరి పేర్లను ముఖ్యమంత్రి మంగళవారం యాదాద్రి పర్యటన సందర్భంగా స్వయంగా ప్రకటించారు. ఒక్కరోజులోనే సుమారు 22 కిలోల పసిడి విరాళంగా (22kg gold donate) సమకూరింది.

'యాదాద్రికి మా కుటుంబం తరఫున కిలో 16 తులాల బంగారం ఇస్తా. తొలి విరాళంగా మా కుటుంబం బంగారం విరాళమిస్తుంది. మంత్రి మల్లారెడ్డి కిలో బంగారం ఇస్తామన్నారు. మేడ్చల్‌ ప్రజల తరఫున మల్లారెడ్డి మరో కిలో బంగారం ఇస్తామన్నారు. నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి 2 కిలోల బంగారం ఇస్తామన్నారు. కావేరీ సీడ్స్‌ తరఫున భాస్కర్‌రావు కిలో బంగారం ఇస్తామన్నారు. దామోదర్‌రావు కిలో బంగారం విరాళం ఇస్తామన్నారు. చాలా మంది కిలో బంగారం చొప్పున కానుక ఇస్తామన్నారు. చినజీయర్‌స్వామి పీఠం నుంచి కిలో బంగారం ఇస్తామన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కిలో బంగారం ఇస్తామన్నారు. యావత్‌ ప్రజానీకంలో యాదాద్రి తమదనే భావం రావాలి.'

-- యాదాద్రిలో సీఎం కేసీఆర్

హెటిరో చైర్మ‌న్ పార్థ సార‌ధి రెడ్డి 5 కిలోల బంగారం

ముఖ్యమంత్రి కేసీఆర్​ చూపిన స్ఫూర్తితో యాదాద్రి విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం హెటెరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ పార్థసారథిరెడ్డి 5 కిలోల బంగారాన్ని (5KG Gold donation to Yadadri) విరాళమివ్వనున్నట్లు ప్రకటించారు. త‌న కుటుంబం త‌ర‌పున ఈ విరాళం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భారీ విరాళం

సిద్దిపేట నియోజకవర్గ ప్రజల తరఫున కిలో బంగారం ఇస్తామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మైనంపల్లి హన్మంతరావు, మాధవరం కృష్ణారావు, వివేకానంద్‌, ఎమ్మెల్సీలు కె.నవీన్‌ కుమార్‌, శంభీపూర్‌ రాజు, ఏపీలోని కడప జిల్లా చిన్న మండెం జడ్పీటీసీ సభ్యురాలు, వ్యాపారవేత్త మోడెం జయమ్మ ఒక్కొక్కరు కిలో బంగారం చొప్పున ఇస్తామని ప్రకటించారు.

Last Updated : Oct 20, 2021, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.