ETV Bharat / state

యాదాద్రిలో వైభవంగా హనుమాన్ శోభయాత్ర - యాదాద్రిలో వైభవంగా హనుమాన్ శోభయాత్ర

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. యాదాద్రి పురవీధుల్లో ఆంజనేయ స్వామి శోభయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

యాదాద్రిలో వైభవంగా హనుమాన్ శోభయాత్ర
author img

By

Published : May 29, 2019, 9:40 PM IST

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి కొండపైన పుష్కరిణి వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆంజనేయ స్వామి వారికి లక్ష తమలపాకులతో అర్చన చేశారు. 128 సార్లు నీటితో అభిషేకం, స్వామి వారికి వడమాల సమర్పణ, నివేదన లాంటి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం హిందు దేవాలయాల పరిరక్షణ సమితి హనుమాన్ శోభయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానికులు, భక్తులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

యాదాద్రిలో వైభవంగా హనుమాన్ శోభయాత్ర


ఇవీ చూడండి: 'విభజన హామీల అమలుకు కృషి చేయండి'

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి కొండపైన పుష్కరిణి వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆంజనేయ స్వామి వారికి లక్ష తమలపాకులతో అర్చన చేశారు. 128 సార్లు నీటితో అభిషేకం, స్వామి వారికి వడమాల సమర్పణ, నివేదన లాంటి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం హిందు దేవాలయాల పరిరక్షణ సమితి హనుమాన్ శోభయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానికులు, భక్తులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

యాదాద్రిలో వైభవంగా హనుమాన్ శోభయాత్ర


ఇవీ చూడండి: 'విభజన హామీల అమలుకు కృషి చేయండి'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.