ETV Bharat / state

రేషన్​కార్డు లేని పేద కుటుంబాలకు సరకుల పంపిణీ

లాక్​డౌన్​ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరులో రేషన్​కార్డు లేని పేద కుటుంబాలకు దొంతిరి నర్సింహారెడ్డి నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్​ హాజరై సరకులు అందించారు.

author img

By

Published : May 21, 2020, 8:10 PM IST

groceries distribution
groceries distribution

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో గల పాఠశాల ఆవరణలో దొంతిరి నర్సింహా రెడ్డి సహకారంతో మండలంలోని రేషన్​కార్డు లేని పేద కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ కిమ్యానాయక్ ముఖ్యఅతిథిగా హాజరై పేదలకు సరకులు అందించారు. లాక్​డౌన్ సమయంలో సరకులు పంపిణీ చేసిన దొంతిరి నర్సింహా రెడ్డికి, దీనికోసం కృషి చేసిన తహసీల్దార్ జ్యోతికి అదనపు కలెక్టర్​ అభినందనలు తెలియజేశారు.

దేశంలో కరోనా కేసులు లక్ష దాటిపోయాయని, వైరస్​ నియంత్రణ కోసం ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని అదనపు కలెక్టర్​ కిమ్యానాయక్​ సూచించారు. గ్రామాలకు వచ్చిన వలస కార్మికులపై వివక్ష చూపొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ యాదగిరి, తహసీల్దార్​ జ్యోతి, ఎంపీడీవో వీరస్వామి, దాత దొంతిరి నర్సింహా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కాంగ్రెస్ శ్రేణులు

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో గల పాఠశాల ఆవరణలో దొంతిరి నర్సింహా రెడ్డి సహకారంతో మండలంలోని రేషన్​కార్డు లేని పేద కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ కిమ్యానాయక్ ముఖ్యఅతిథిగా హాజరై పేదలకు సరకులు అందించారు. లాక్​డౌన్ సమయంలో సరకులు పంపిణీ చేసిన దొంతిరి నర్సింహా రెడ్డికి, దీనికోసం కృషి చేసిన తహసీల్దార్ జ్యోతికి అదనపు కలెక్టర్​ అభినందనలు తెలియజేశారు.

దేశంలో కరోనా కేసులు లక్ష దాటిపోయాయని, వైరస్​ నియంత్రణ కోసం ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని అదనపు కలెక్టర్​ కిమ్యానాయక్​ సూచించారు. గ్రామాలకు వచ్చిన వలస కార్మికులపై వివక్ష చూపొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ యాదగిరి, తహసీల్దార్​ జ్యోతి, ఎంపీడీవో వీరస్వామి, దాత దొంతిరి నర్సింహా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కాంగ్రెస్ శ్రేణులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.