ETV Bharat / state

'15 రోజులు అవుతున్నా కాంటా ఏర్పాటు చేయలేదు' - ikp news

యాదాద్రి భువనగిరి జిల్లా మర్యాల గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్​కి తెచ్చి 15 రోజులు అవుతున్నా ఇంత వరకు కాంటా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు.

Maryala village news, ikp news, Yadadri Bhuvanagiri district
Maryala village news, ikp news, Yadadri Bhuvanagiri district
author img

By

Published : Apr 23, 2021, 4:12 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లలో కొనుగోలు చేయడం లేదని రైతులు అధికారులపై మండిపడ్డారు. బొమ్మల రామారం మండలంలోని మర్యాల గ్రామంలోని ఐకేపీ సెంటర్​ వద్ద రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయిందని, ఐకేపీ సెంటర్​కి తెచ్చి 15 రోజులు అవుతున్నా కాంటా ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు తెలిపారు.

తొందరగా కాంటా ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. లేనియెడల తడిసిన ధాన్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్​ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు కేంద్రాల వద్ద అధికారుల నిర్లక్ష్యంతో నేలపాలు అవుతుందని రైతులు తమ ఆవేదన వెలిబుచ్చారు.

ఇదీ చూడండి: 18 ఏళ్లు దాటిన వారి టీకా ఖర్చు రూ.67,193 కోట్లు!

యాదాద్రి భువనగిరి జిల్లాలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లలో కొనుగోలు చేయడం లేదని రైతులు అధికారులపై మండిపడ్డారు. బొమ్మల రామారం మండలంలోని మర్యాల గ్రామంలోని ఐకేపీ సెంటర్​ వద్ద రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయిందని, ఐకేపీ సెంటర్​కి తెచ్చి 15 రోజులు అవుతున్నా కాంటా ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు తెలిపారు.

తొందరగా కాంటా ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. లేనియెడల తడిసిన ధాన్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్​ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు కేంద్రాల వద్ద అధికారుల నిర్లక్ష్యంతో నేలపాలు అవుతుందని రైతులు తమ ఆవేదన వెలిబుచ్చారు.

ఇదీ చూడండి: 18 ఏళ్లు దాటిన వారి టీకా ఖర్చు రూ.67,193 కోట్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.