ETV Bharat / state

యాదగిరిగుట్టలో నిత్యావసరాల పంపిణీ - భువనగిరి డీసీపీ యాదగిరిగుట్ట నిత్యావసరాలు పంపిణీ

లాక్​డౌన్​ సమయంలో వలస కార్మికులకు అండగా నిలిచేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. దాతల సహకారంతో యాదగిరిగుట్ట పీఎస్‌ ఆవరణలో 300 మంది వలస కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. భువనగిరి జోన్‌ డీసీపీ నారాయణ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని సరుకులు అందజేశారు.

యాదగిరిగుట్టలో నిత్యావసరాల పంపిణీ
యాదగిరిగుట్టలో నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : Apr 19, 2020, 11:29 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్ ఆవరణలో దాతల సహకారంతో దాదాపు 300 మంది వలస కూలీలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డితో పాటు యాదగిరిగుట్ట ఏసీపీ, సీఐ, మున్సిపల్ కమిషనర్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొని సరుకులు అందజేశారు. అనంతరం యాదగిరిగుట్ట పురపాలిక కౌన్సిలర్లు, మండలంలోని సర్పంచ్‌లతో డీసీపీ సమావేశమయ్యారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు, ఆరోగ్య శాఖ వారికి సమాచారమివ్వాలని సూచించారు. ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్ ఆవరణలో దాతల సహకారంతో దాదాపు 300 మంది వలస కూలీలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డితో పాటు యాదగిరిగుట్ట ఏసీపీ, సీఐ, మున్సిపల్ కమిషనర్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొని సరుకులు అందజేశారు. అనంతరం యాదగిరిగుట్ట పురపాలిక కౌన్సిలర్లు, మండలంలోని సర్పంచ్‌లతో డీసీపీ సమావేశమయ్యారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు, ఆరోగ్య శాఖ వారికి సమాచారమివ్వాలని సూచించారు. ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో 800 మార్కు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.