యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి రైల్వే స్టేషన్ సమీపంలో విషాదం నెలకొంది. రాయగిరి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్పై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బస్వాపురం గ్రామానికి చెందిన అన్నం పట్ల వంశీగా పోలీసులు గుర్తించారు.
వంశీ వృత్తి రీత్యా కారు డ్రైవర్. ఈరోజు తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : ఓయూలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం