ETV Bharat / state

యాదాద్రి అభివృద్ధి పనుల ఆలస్యంపై సీఎంవో ఆగ్రహం - ఆలయ పునర్మిర్మాణ పనుల పురోగతిలో ఆలస్యంపై సీఎంవో ఆగ్రహం

యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయ పునర్మిర్మాణ పనుల పురోగతిలో ఆలస్యంపై సీఎంవో భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానాలయంలో చేపట్టిన అన్ని​ పనులను త్వరగా పూర్తి చేయాలని వైటీడీఏ అధికారులను ఆదేశించారు.

CMO bhupal reddy  angry on ytda officers on  Yadadri development works
ప్రధానాలయంలో పనులను పరిశీలిస్తున్న సీఎంవో భూపాల్​ రెడ్డి
author img

By

Published : Jan 27, 2021, 9:23 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయ పునర్మిర్మాణ పనులను సీఎంవో భూపాల్​ రెడ్డి తనిఖీ చేశారు. ప్రధానాలయంలో నిర్మాణ పనుల ఆలస్యం కావడంపై వైటీడీఏ అధికారులపై మండిపడ్డారు. దాదాపు గంటసేపు రాజగోపురాలను, మాడవీధులను పరిశీలించారు. కృష్ణశిలతో చేసిన ఫ్లోరింగ్​ను శుద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ప్రధానాలయం వద్ద చేపడుతున్న రథశాల, లిఫ్టు, క్యూలైన్​ పనులను వేగవంతం చేయాలని కోరారు.

CMO bhupal reddy  angry on ytda officers on  Yadadri development works
యాదాద్రి అభివృద్ధి పనులపై సీఎంవో ఆగ్రహం

పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని.. ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర సందర్శనకు త్వరలో సీఎం రానున్న సందర్భంగా నిర్మాణ పనులు ముమ్మరం చేయాలన్నారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండపైన హరిత టూరిజంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జరిపారు. ఈ సమావేశంలో వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ఆర్కిటెక్చర్ ఆనందసాయి, చీఫ్ ఇంజనీర్ గణపతిరెడ్డి, ఈవో గీతారెడ్డి, ఆలయ స్థపతి ఆనందచారి వేలు, ఎస్ఈ వసంత నాయక్, డీఈలు, ఈఈ, వైటీడీఏ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : పీఆర్‌సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతల ఆందోళన

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయ పునర్మిర్మాణ పనులను సీఎంవో భూపాల్​ రెడ్డి తనిఖీ చేశారు. ప్రధానాలయంలో నిర్మాణ పనుల ఆలస్యం కావడంపై వైటీడీఏ అధికారులపై మండిపడ్డారు. దాదాపు గంటసేపు రాజగోపురాలను, మాడవీధులను పరిశీలించారు. కృష్ణశిలతో చేసిన ఫ్లోరింగ్​ను శుద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ప్రధానాలయం వద్ద చేపడుతున్న రథశాల, లిఫ్టు, క్యూలైన్​ పనులను వేగవంతం చేయాలని కోరారు.

CMO bhupal reddy  angry on ytda officers on  Yadadri development works
యాదాద్రి అభివృద్ధి పనులపై సీఎంవో ఆగ్రహం

పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని.. ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర సందర్శనకు త్వరలో సీఎం రానున్న సందర్భంగా నిర్మాణ పనులు ముమ్మరం చేయాలన్నారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండపైన హరిత టూరిజంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జరిపారు. ఈ సమావేశంలో వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ఆర్కిటెక్చర్ ఆనందసాయి, చీఫ్ ఇంజనీర్ గణపతిరెడ్డి, ఈవో గీతారెడ్డి, ఆలయ స్థపతి ఆనందచారి వేలు, ఎస్ఈ వసంత నాయక్, డీఈలు, ఈఈ, వైటీడీఏ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : పీఆర్‌సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.