లాక్డౌన్ అమల్లో ఉన్నందున ఐకేపీ కేంద్రాల వద్ద రైతులు సమూహంగా ఉండకూడదని ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సూచించారు. రైతులందరూ భౌతిక దూరం పాటించాలని కోరారు. యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. యాదాద్రి జిల్లా వ్యాప్తంగా కోటి గన్నీ సంచులు అవసరం ఉండగా... 30 లక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. కలెక్టర్తో మాట్లాడి గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూస్తామన్నారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో 644కు చేరిన కరోనా కేసులు