ETV Bharat / state

వడ్డీ వేధింపులు: ఇద్దరు పిల్లలతో సహా మహిళ ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Jul 21, 2020, 10:11 AM IST

వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలతో సహా ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ దుర్ఘటన వరంగల్ నగరంలో వెలుగుచూసింది.

one woman and his two childrem commit suicide
ఇద్దరు పిల్లలతో సహా మహిళ ఆత్మహత్యాయత్నం

వరంగల్ అర్బన్ జిల్లా శివనగర్​కు చెందిన రజిత అదే కాలనీకి చెందిన మంజుల వద్ద అవసరాల నిమిత్తం 50 వేల రూపాయలను 10 శాతం వడ్డీతో అప్పుగా తీసుకుంది. 20 నెలల పాటు వడ్డీ చెల్లించిన రజిత లాక్​డౌన్ కారణంగా వడ్డీ చెల్లించడం మానేసింది. చాలా రోజులుగా వడ్డీ కట్టకపోవడం వల్ల కోపోద్రిక్తురాలైన మంజుల... రజిత ఇంటికి చేరుకొని నానా హంగామా చేసింది.

అందరి ముందు తన పరువు పోయిందని భావించిన రజిత తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా రైల్వే స్టేషన్​కి చేరుకొని పట్టాలపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం గమనించిన రైల్వే సిబ్బంది అడ్డుకొని వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. రజిత ఫిర్యాదు మేరకు వడ్డీ వ్యాపారి మంజులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వరంగల్ అర్బన్ జిల్లా శివనగర్​కు చెందిన రజిత అదే కాలనీకి చెందిన మంజుల వద్ద అవసరాల నిమిత్తం 50 వేల రూపాయలను 10 శాతం వడ్డీతో అప్పుగా తీసుకుంది. 20 నెలల పాటు వడ్డీ చెల్లించిన రజిత లాక్​డౌన్ కారణంగా వడ్డీ చెల్లించడం మానేసింది. చాలా రోజులుగా వడ్డీ కట్టకపోవడం వల్ల కోపోద్రిక్తురాలైన మంజుల... రజిత ఇంటికి చేరుకొని నానా హంగామా చేసింది.

అందరి ముందు తన పరువు పోయిందని భావించిన రజిత తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా రైల్వే స్టేషన్​కి చేరుకొని పట్టాలపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం గమనించిన రైల్వే సిబ్బంది అడ్డుకొని వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. రజిత ఫిర్యాదు మేరకు వడ్డీ వ్యాపారి మంజులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: 'దేశంలోనే తెలంగాణ అతి తక్కువ పరీక్షలు చేస్తుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.