ETV Bharat / state

చెరువు తూముకు చిల్లుపడింది... రైతుల గుండె ఝల్లుమంటోంది

చెరువు తూముకు బుంగ పడి నీరంతా వృథాగా పోతోందని ఎల్కతుర్తి మండలం గోపాల్​పూర్​ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టాలని వేడుకుంటున్నారు.

author img

By

Published : Nov 5, 2019, 9:17 PM IST

చెరువు తూముకు చిల్లుపడింది... రైతుల గుండె ఝల్లుమంటోంది

వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్​పూర్​లోని పెద్ద చెరువు నుంచి నీరు వృథాగా పోతోందని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. నక్కల తూముకు బుంగ పడి నీరంతా వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా చెరువు తూముకు మరమ్మతులు నాసిరకంగా చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలికి వచ్చిన ఇరిగేషన్ శాఖ అధికారులను గ్రామస్థులు, రైతులు నిలదీశారు. మూడేళ్లకే తూము చెడిపోవడానికి కారణం నాసిరకం పనులేనని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరమ్మతులు చేయిస్తామని అధికారుల హామీతో ఆందోళన విరమించారు.

చెరువు తూముకు చిల్లుపడింది... రైతుల గుండె ఝల్లుమంటోంది

ఇదీ చూడండి: 'ధనలక్ష్మి దోచేసింది.. న్యాయం చేయండి'

వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్​పూర్​లోని పెద్ద చెరువు నుంచి నీరు వృథాగా పోతోందని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. నక్కల తూముకు బుంగ పడి నీరంతా వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా చెరువు తూముకు మరమ్మతులు నాసిరకంగా చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలికి వచ్చిన ఇరిగేషన్ శాఖ అధికారులను గ్రామస్థులు, రైతులు నిలదీశారు. మూడేళ్లకే తూము చెడిపోవడానికి కారణం నాసిరకం పనులేనని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరమ్మతులు చేయిస్తామని అధికారుల హామీతో ఆందోళన విరమించారు.

చెరువు తూముకు చిల్లుపడింది... రైతుల గుండె ఝల్లుమంటోంది

ఇదీ చూడండి: 'ధనలక్ష్మి దోచేసింది.. న్యాయం చేయండి'

Intro:TG_KRN_101_05_CHERUVU THUMU LEAKAGE_ANDHOLANA_AVB_TS10085
REPORTER:KAMALAKAR
9441842417
-------------------------------------------------------------
వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్ పూర్ పెద్ద చెరువు నక్కల తూముకు బుంగ పడి వృధాగా నీరు పోతున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో చెరువు కట్ట పై గ్రామస్థులు, రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నిండు కుండల ఉన్న చెరువులో నుంచి రోజుకు ఫీట్ వరకు నీరు తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు సంవత్సరాల తరువాత నిండిన చెరువు పై ఆయకట్టు రైతులు ఆశపెట్టుకోగా, మిషన్ కాకతీయ పనుల్లో నాసిరకంగా చెరువు తూముకు మరమ్మతులు చేయించడంతో, చెరువులో నీరు వృధాగా పోతున్నాయని వాపోతున్నారు. ఇప్పటికే అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చిన పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, 220 ఎకరాల విస్తీర్ణ ఆయకట్టతో పాటు, ఆరు గ్రామాల రైతుల బావులలో ఊటకు ఇదే ఆధారం అని, చెరువులో నీరు ఖాళీ అయ్యాక అధికారులు స్పందిస్తారా అని ఆగ్రహం వ్యకం చేశారు. స్థానిక సర్పంచ్ నీరు పోకుండా కూలీలతో ఇసుక బస్తాలు వేయించిన ఆగడం లేదని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తూముకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరారు
సంఘటన స్థలానికి చేరుకున్న ఇరిగేషన్ శాఖ అధికారులను గ్రామస్థులు, రైతులు నిలదీశారు. మూడు సంవత్సరాలకే తూము చెడిపోవడానికి కారణం నాసిరకం పనులే అంటూ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు త్వరగా మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. అధికారులు మరమ్మత్తులు చేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.Body:బైట్
1) భాస్కర్ రావు, గోపాల్ పూర్ గ్రామ సర్పంచ్Conclusion:చెరువు తూము లీకేజ్ గ్రామస్థుల ఆందోళన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.