ETV Bharat / state

'మెడలు వంచడానికి ఆయన హారీశ్ కాదు...మోదీ' - warangal-bjp-meeting

అసెంబ్లీ పోరులో ఒక్క సీటుతో సరిపెట్టుకున్న భాజపా...లోక్​సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. స్వయంగా మోదీ, అమిత్​ షా విజయ సంకల్ప సభల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపర్చే ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్​, హన్మకొండ సభలకు కమల దండు భారీగా తరలిరాగా...దళపతి మాత్రం గైర్హాజరై నిరాశకు గురిచేశారు.

తాటాకు చప్పుళ్లకు భయపడను...
author img

By

Published : Apr 4, 2019, 7:33 PM IST

తాటాకు చప్పుళ్లకు భయపడను...
లోక్​సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన భాజపా...కరీంనగర్​, వరంగల్​లో విజయసంకల్ప సభలు నిర్వహించింది. కేంద్రంలో మళ్లీ మోదీ సర్కారే వస్తుందని నేతలు ప్రసంగాల్లో పునరుధ్ఘాటించారు.

తాటాకు చప్పుళ్లకు భయపడను...

రాష్ట్రాన్ని బారు, బీరుగా మార్చిన కేసీఆర్​ని నమ్ముతారా... దేశాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తోన్న మోదీని నమ్ముతారా...అని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్​ ప్రశ్నించారు. కరీంనగర్​ సభలో తన ప్రసంగంతో కార్యకర్తలను ఉత్సాహపరిచారు​. కేసీఆర్​​ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేందుకు తెరాస కార్యకర్తను కాదని ​ ధ్వజమెత్తారు.

దిల్లీలో మీ పప్పులుడకవు...

రాష్ట్రం దాటితే కేసీఆర్​ చెల్లని రూపాయని లక్ష్మణ్​ ఘాటుగా విమర్శించారు. హన్మకొండ విజయ సంకల్ప సభలో గులాబీ అధిపతిపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో 16 స్థానాలు గెలిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆక్షేపించారు. మెడలు వంచటానికి కేంద్రంలో ఉండేది హరీశ్​రావు కాదు..నరేంద్ర మోదీ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నిరాశపరిచిన అమిత్​ షా...

కరీంనగర్​, వరంగల్​లో నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరైనా....దళపతి అమిత్​ షా హజరుకాకపోవడంతో శ్రేణులు ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు. ప్రధానితో సమావేశం కారణంగా రాలేదని కాషాయ వర్గాలు ప్రకటించాయి.

ఇవీ చూడండి:రాహుల్​ నాయనమ్మ పాటే పాడుతున్నారు: కేసీఆర్​

తాటాకు చప్పుళ్లకు భయపడను...
లోక్​సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన భాజపా...కరీంనగర్​, వరంగల్​లో విజయసంకల్ప సభలు నిర్వహించింది. కేంద్రంలో మళ్లీ మోదీ సర్కారే వస్తుందని నేతలు ప్రసంగాల్లో పునరుధ్ఘాటించారు.

తాటాకు చప్పుళ్లకు భయపడను...

రాష్ట్రాన్ని బారు, బీరుగా మార్చిన కేసీఆర్​ని నమ్ముతారా... దేశాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తోన్న మోదీని నమ్ముతారా...అని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్​ ప్రశ్నించారు. కరీంనగర్​ సభలో తన ప్రసంగంతో కార్యకర్తలను ఉత్సాహపరిచారు​. కేసీఆర్​​ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేందుకు తెరాస కార్యకర్తను కాదని ​ ధ్వజమెత్తారు.

దిల్లీలో మీ పప్పులుడకవు...

రాష్ట్రం దాటితే కేసీఆర్​ చెల్లని రూపాయని లక్ష్మణ్​ ఘాటుగా విమర్శించారు. హన్మకొండ విజయ సంకల్ప సభలో గులాబీ అధిపతిపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో 16 స్థానాలు గెలిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆక్షేపించారు. మెడలు వంచటానికి కేంద్రంలో ఉండేది హరీశ్​రావు కాదు..నరేంద్ర మోదీ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నిరాశపరిచిన అమిత్​ షా...

కరీంనగర్​, వరంగల్​లో నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరైనా....దళపతి అమిత్​ షా హజరుకాకపోవడంతో శ్రేణులు ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు. ప్రధానితో సమావేశం కారణంగా రాలేదని కాషాయ వర్గాలు ప్రకటించాయి.

ఇవీ చూడండి:రాహుల్​ నాయనమ్మ పాటే పాడుతున్నారు: కేసీఆర్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.