వరంగల్ నగరంలోని 25వ డివిజన్ కార్పొరేటర్ రిజ్వాన మసూద్ సమావేశాన్ని నిర్వహించి లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. 14 మంది అర్హులకు రూ. 13 లక్షల 76 వేల విలువగల చెక్కులను పంపిణీ చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ ప్రజలెవరూ అనవసరంగా బయటకు రావొద్దని.. అత్యవసరమైన సమయాల్లో మాత్రమే రోడ్లపైకి రావాలని ఆమె సూచించారు. అలా వచ్చినప్పుడు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని మాస్కులు ధరించాలని తెలిపారు.