ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో యాజమాన్య కోటా కింద ప్రవేశానికి ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. ఈ నెల 25 నుంచి 28 వరకు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఓయూ ప్రాంగణంలోని ప్రొ.రాంరెడ్డి దూరవిద్య కేంద్రంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ధ్రువపత్రాల పరిశీలన, ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని తెలిపారు. పూర్తి వివరాల కోసం వర్సిటీ వెబ్సైట్ http://knruhs.telangana.gov.in/లో సంప్రదించాలని సూచించారు.
ఇవీ చూడండి : వెట్టిచాకిరిలో మగ్గుతున్న బాలలకు విముక్తి